వికారాబాద్, ఏప్రిల్ 10 : లోక్ సభ ఎన్నికల దృష్ట్యా బుధవారం ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు బీడీ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్) టీమ్ అధికారులు వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
జిల్లాలో ఎక్కడైనా మత్తు, పేలుడు పదార్థాలు రవాణా జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలని, లేదా 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.