తాండూరు, జూన్ 30 : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీతోపాటు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కొత్తగా తీసుకొచ్చిన జీవోలను రద్దు చేసి పాత విధానం ప్రకారమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 2021 నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం పేద విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు సయ్యద్ శుకూర్, జిల్లా నాయకుడు వెంకటేశ్, మహిళా ప్రతినిధులు అనిత, నర్సమ్మ, మంజుల, జగదీశ్వరి, వీరమణి, బస్వరాజ్, బీసీ సంఘం తాండూరు మండలాధ్యక్షులు నరేందర్, బసంత్, జోసఫ్, రాము ముదిరాజ్, నవీన్, మంతన్గౌడ్ అశోక్, టైలర్ రమేశ్, బీటీ . సురేశ్, పోచయ్య, తాండూరు నియోజకవర్గంలోని పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.