తలకొండపల్లి, జనవరి 27 : బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మాడ్గుల, తలకొండపల్లి, వెల్దండ మండలాలకు చెందిన ముగ్గురికి సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను శుక్రవారం అందజేశారు.
తలకొండపల్లి మండలంలోని మెదక్పల్లి గ్రామానికి చెందిన చెన్నయ్యకు రూ.60వేలు, మాడ్గుల గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు రూ.60వేలు, వెల్దండ మండలం చెదురువెల్లికి చెందిన ఎల్లమ్మకు రూ.28వేల చొప్పున మంజూరైన చెక్కులను అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.