రంగారెడ్డి, సెప్టెంబర్ 26, (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని సబ్బండ వర్గాలవారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ‘ఆసరా’ పింఛన్లు అందుకుంటున్న వారు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే దేశంలో ఆసరాలేని వారికి అండగా నిలుస్తారని ముక్తకంఠంతో తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక దేశంలో ఎక్కడాలేని విధంగా పింఛన్లను రూ.వెయ్యి చేయడంతో పాటు దివ్యాంగులకు రూ.1500లకు పెంచి పేద కుటుంబాలను పెద్ద కొడుకులా ఆదుకున్నారని పేర్కొంటున్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆసరా పింఛన్లు రూ.2016, దివ్యాంగులకు రూ.3016లకు పెంచి కొండంత ధైర్యాన్ని నింపి పేదల గుండెల్లో సీఎం కేసీఆర్ దేవుడయ్యాడని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లబ్ధిదారులు గుర్తు చేసుకుంటున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, పైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందజేస్తూ కొడుకులా, అన్నలా, ఆపద్బాంధవుడిలా అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ జాతీయస్థాయి రాజకీయాల్లోకి వెళితే దేశంలోని పేదలకు మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఏ ఆసరా లేని వారికి సీఎం కేసీఆర్ పింఛన్లు అందిస్తూ అండగా నిలుస్తున్నారని పలువురు ఆసరా పింఛన్ లబ్ధిదారులు పేర్కొంటున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అరకొరగా వచ్చే పింఛన్ డబ్బులతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారిమని.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి .. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే తమకు మంచి రోజులు వచ్చాయని, పింఛన్ డబ్బులను భారీ స్థాయిలో పెంచి అందిస్తున్నారని పేర్కొంటున్నారు.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, దివ్యాంగులకు ప్రతినెలా పింఛన్ డబ్బులను అందిస్తూ వారి కుటుంబాల్లో సీఎం కేసీఆర్ పెద్ద కొడుకు పాత్రను పోషిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని రాష్ర్టాల్లోని పింఛన్దారులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ముక్తకంఠంతో చెబుతున్నారు.
బంగారు భారత్గా మార్చాలి
బంగారు తెలంగాణ తరహాలోనే దేశాన్ని కూడా బంగారుమయంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే. జనం మెచ్చిన నాయకుడు ఆయన. ప్రాణాలొడ్డి రాష్ర్టాన్ని సాధించి, బం గారు తెలంగాణ నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తు న్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పొరుగు రాష్ర్టాల ప్రజలు పొగుడుతున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే పేదలకు మంచి రోజులు వస్తాయి. మరిన్ని సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అందుతాయి.
– చంద్రయ్య, పింఛన్దారు, కొడంగల్
కొండంత అండగా ఆసరా..
ఆసరా పింఛన్ పథకం రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులకు ఎంతో ఆసరాగా నిలిస్తున్నది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లి అర్హులందరికీ పింఛన్లు అందించాలి. – రెడ్డిపల్లి దుర్గయ్య , టేకులపల్లి గ్రామం, మోమిన్పేట
పెద్ద కొడుకులా ఆదుకుంటున్నారు
సీఎం కేసీఆర్ తన లాంటి ఎంతో మంది వృ ద్ధులకు ఆసరా పింఛన్లు అందించి పెద్ద కొడుకులా ఆదుకుంటున్నారు. ఆయన ఏ పనిని చేపట్టినా ప్రజల సంక్షేమాన్ని కోరే చేపడుతున్నారు. దేశంలో ఉన్న అర్హులందరికీ పింఛన్లు రావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే.
– సత్యనారాయణ, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం
కేసీఆర్ సేవలు దేశానికి అవసరం
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పింఛన్ల మొత్తాన్ని పెంచారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పింఛన్ డబ్బులు చాలా తక్కువగా వచ్చే వి. ఖర్చులకు కూడా సరిపోయేవి కావు. సీఎం కేసీఆర్ది గొప్ప మనుస్సు. ఆయ న సేవలు దేశానికి ఎంతో అవసరం.
– మడ్డి యాదమ్మ, పింఛన్దారు మేడిపల్లి, ఇబ్రహీంపట్నం
సీఎం కేసీఆర్ బాగుండాలి
నాకు కొడుకులు లేరు. పెద్ద కొడుకులాగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారు. ప్రతినెలా రూ. 2016 పింఛన్ డబ్బులను ఇస్తున్నాడు. కేసీఆర్ బాగుండి.. దేశం మొత్తం పరిపాలించాలి. ఆయనతోనే దేశాభివృద్ధి సాధ్యం. తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
– జంగ అంజమ్మ, ఆసరా పింఛన్దారు, నందిగామ
ప్రజల కోసం పని చేస్తున్నారు
సీఎం కేసీఆర్ ప్రజల కేసమే పనిచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందించి ఆదుకుంటున్నారు. ఇలాం టి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. దేశం కూడా మరింత అభివృద్ధిని సాధిస్తుంది.
– పద్మమ్మ, పింఛన్దారు, షాద్నగర్టౌన్
పింఛన్దారులను అండగా..
పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. అర్హులకు ఆసరా పింఛన్లను అందిస్తూ ఆదుకుంటున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాతే అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పాలన దేశవ్యాప్తంగా అందిస్తే అన్ని వర్గాల ప్రజలు బాగుపడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి.
– మంగలి రాంచంద్రయ్య, పింఛన్దారు, ముడిమ్యాల్ గ్రామం, చేవెళ్ల
ప్రజలు సంతోషంగా ఉన్నారు
సీఎం కేసీఆర్ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ల ను అందజేస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నా రు. ప్రజల సంక్షేమానికే ఆయన నిరంతరం కృ షి చేస్తున్నారు. ఆయన పాలనలో రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. – సత్యమ్మ, పింఛన్దారు, రావులపల్లి గ్రామం, చేవెళ్ల
దేశం సుభిక్షంగా ఉంటుంది
సీఎం కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణలో అమలవుతున్న పథకాలు మొత్తం దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని ప్రజలకు అందుతాయి. తద్వారా వారు కూడా ఆర్థికంగా ఎదుగుతారు. దేశంలో కూడా సుభిక్షంగా ఉంటుంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయి.
– అంజయ్య, పింఛన్దారు, కుమ్మరిగూడ,షాబాద్
దేశం బాగుపడుతుంది
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది. దేశంలోని సమస్యలపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభు త్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనితీరు బా గుండటంతోపాటు మంచి విజన్ ఉన్న నాయకుడు ఆయన. అంతేకాకుండా ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొం తం. తక్షణమే ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– కల్లెం రాంరెడ్డి, యెల్లకొండ గ్రామం, నవాబుపేట
గతంలో పట్టించుకోలేదు
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు రకాల సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పింఛన్దారులను పట్టించుకోలేదు. నెలకు కేవలం రూ.రెండు వందల పింఛన్ మా త్రమే వచ్చేది. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆసరా పింఛన్లను భారీ స్థాయిలో పెంచి పింఛన్దారులను ఆదుకుంటున్నారు. ఇలాంటి నాయకుడు ప్రధాని అయితే దేశంలోని పింఛన్దారులతోపాటు బడు గు, బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుం ది. దీంతో దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. – నర్సింహులు, ఆసరా పింఛన్దారు, పెద్దేముల్ గ్రామం, పెద్దేముల్ మండలం
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి
దేశంలోని వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు న్యాయం జరుగాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. తెలంగాణలో నాలాంటి పింఛన్దారులు ప్రతినెలా వచ్చే పింఛన్ డబ్బులతో హాయిగా జీవిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఎవరిపైనా ఆధారపడడంలేదు. దేశంలోని అన్ని రంగాలపై సీఎం కేసీఆర్కు అనుభవం ఉండటంతో ఆయన జాతీయ పార్టీని పెట్టి.. ప్రధాని అయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.
– బాలమ్మ,ఆసరా పింఛను లబ్ధిదారు, పెద్దేముల్ గ్రామం
దేశం అభివృద్ధి చెందుతుంది
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామం. కులమతాలకతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. అదే నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. తెలంగాణ తరహాలోనే దేశం కూడా మరింత అభివృద్ధి చెందాలి. అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. దేశ ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపో యి సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నా రు. కేసీఆర్ పీఎం దేశం అగ్రగామిగా నిలుస్తుం ది. సబ్బండ వర్గాల బాధలు తీరాలంటే సీఎం కేసీఆర్ పాలన రావాల్సిందే.
– సాయిలు, దుద్యాల, కొడంగల్