రంగారెడ్డి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : సీఎస్ఆర్ నిధులతో తెలంగాణ మోడల్స్కూల్కు రంగులు వేసి కొత్తగా నిర్మించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో నిర్మించిన భవనాలకు, షెడ్లకు కొత్తగా రంగులువేసి తామేదో సాధించామని కాంగ్రెస్ నేతలు జబ్బలు దర్సుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఆరుట్ల గ్రామంలో ఎప్పటినుంచో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ప్రీప్రైమరీ పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండగా…దానిని తెలంగాణ మోడల్స్కూల్ అని తెలంగాణ ప్రభుత్వం మార్చిందన్నారు. విద్యాకమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి విద్యావ్యవస్థను మారుస్తానని తెలంగాణ మోడల్స్కూల్ను తెలంగాణ పబ్లిక్స్కూల్ను నామకరణం చేశారని ఆయన అన్నారు. ఈ స్కూల్ ఆధునీకరణ కోసం సోషల్ డెమోక్రెటిక్ ఫోరం సీఎస్ఆర్ నిధుల కింద రూ.23లక్షలను నిధులు జమ చేసిందని అన్నారు. ఈ నిధులతో స్కూల్ బయట గోడలకు పెయింటింగ్, ప్రహారీగోడ, భూగర్భఢ్రైనేజీ, ఆటవస్తువులు, ఫర్నిచర్, ఫుట్బాల్, క్రికెట ఆడుకునేందుకు వీలుగా నెట్బాక్సులు నిర్మించారని అన్నారు.
పైన పటారం…లోన లొటారం అన్నట్లు కేవలం ముందువైపు రంగులువేసి వెనుక గోడలను కూడా వదిలేశారని, టాయిలెట్లను కూడా మార్చలేదని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో ఇప్పటి వరకు కొత్తగా భవనాల నిర్మాణం చేసిందేమీ లేకపోగా…పాత భవనాలకు కేవలం బయటే రంగులు వేశారని అన్నారు. ఇది రేవంత్ మార్కు అభివృద్ధి అయి ఆయన ఎద్దేవా చేశారు. కేవలం రంగులు మార్చటకోసం రూ.23లక్షల నిధులను ఖర్చుచేశారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.