షాద్నగర్, మార్చి 19: తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 157మంది లబ్ధిదారులకు రూ. 75. 20లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే భూముల ధరలు పడిపోతాయని, తెలంగాణ ప్రాంతం వెనుకబడుతుందని లేనిపోని అపోహలు కల్పించిన ఆనాటి నేతలకు నేడు జరుగుతున్న అభివృద్ధే ప్రత్యక్ష సాక్ష్యమని అభిప్రాయపడ్డారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని, ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపాలని కోరారు. షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్నగర్ మండలంలో 33 మందికి రూ. 13,93, 500, మున్సిపాలిటీలో 18 మందికి రూ. 7,49, 500, కేశంపేట్ మండలంలో 30 మందికి రూ. 17,02, 000, నందిగామ మండలంలో 18 మందికి రూ. 9,63, 000, కొత్తూరు మండలంలో 19 మందికి రూ. 7,78, 000, కొందుర్గు మండలంలో 13 మందికి రూ. 7,52, 000, జిల్లేడు చౌదరిగూడ మండలంలో 12 మందికి రూ. 5,38, 000, మరో 14 మందికి రూ. 6,52, 000 మొత్తం 157మందికి రూ. 75.20లక్షల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, బంగారు స్వరూప, ఎంపీపీ వై. రవీందర్యాదవ్, ఖాజా ఇద్రీస్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, అగ్గనూర్ విశ్వం, బెంది శ్రీనివాస్రెడ్డి, దామోదర్రెడ్డి, బక్కన్నయాదవ్ పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరాముడి శోభాయాత్రకు సంబంధించిన వాల్పోస్టర్ను పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు బండారి రమేశ్, వివిధ పార్టీల నాయకులు శ్రీవర్ధన్రెడ్డి, అందె బాబయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్రెడ్డి, చెట్ల వెంకటేశ్, రమేశ్, శ్రీను, మురళీ పాల్గొన్నారు.