వికారాబాద్, సెప్టెంబర్ 9 : పాలన సౌలభ్యం కోసం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘ నత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, సమాచార పౌర సం బంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని స మావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమా న్ని మంత్రి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాలో నాలుగేండ్ల శిక్షణాకాలం పూర్తి చేసుకున్న 309 మంది పంచాయతీ సెక్రటరీలకు పూర్తి కాలపు ఉద్యోగులుగా నియామక పత్రాల ను పంపిణీ చేశారు. అంతకు ముందు జిల్లాకు నూతనంగా మంజూరైన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీరింగ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీల ఏర్పాటుతో పాటు కార్యనిర్వాహక ఉద్యోగుల నియామకం కోసం కొత్తగా 9 వేలకు పైగా పంచాయతీ కార్యదర్శుల నియామకాలు చే పట్టినట్లు చెప్పారు.
రాష్ట్రంలో నాలుగేండ్లు పూర్తి చేసుకున్న 5,721 మంది పంచాయతీ కార్యదర్శుల్లో 5,038 మందికి పూర్తి కాలపు ఉద్యోగులుగా నియామక పత్రాలు జారీ చేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 429 మందిలో 309 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పూర్తి కాలపు ప్రభుత్వ ఉద్యోగులుగా నియామక పత్రాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. నియామక పత్రాలు అందుకున్న పంచాయతీ కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విధి నిర్వహణలో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని సూచించారు.
ఉత్తమ సేవలకు అత్యుత్తమ ప్రతిఫలం
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో సీఎం కేసీఆర్ అప్పటి ప్రజల బాధలను అర్థం చేసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రా మ స్థాయిలో ఉత్తమంగా అందించిన సేవలకు ప్రతిఫలంగా గ్రామ కార్యకార్యదర్శులను రెగ్యులరైజ్ చేయడం హర్షణీయమన్నారు. తెలంగాణ ప్రజల కోసం తపనపడే ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. రెగ్యులర్ అయిన వారందరికీ ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సదుపాయాలు లభిస్తాయని వివరించారు.
కార్యక్రమం లో వికారాబాద్, చేవెళ్ల పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్య, మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, ఈఈపీఆర్ శ్రీనివాస్రెడ్డి, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, ఎంపీడీవో సత్తయ్య, జిలా అధికారులు పాల్గొన్నారు.