కడ్తాల్ : మండలంలో 57సంవత్సరాలు నిండిన వారందరూ ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వారు పింఛన్ల కోసం, ఓటరు కార్డు, ఆధార్ జీరాక్స్ను దరఖాస్తు ఫారానికి జతచేసి, మీ సేవ కేంద్రాల్లో ఇవ్వాలని ఎంపీడీవో సూచించారు.
షాబాద్ : గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులు ఆసరా పింఛన్ కోసం మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని షాబాద్ ఎంపీడీవో అనురాధ తెలిపారు. మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దరఖాస్తు ఫారం, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా బుక్, ఓటర్ గుర్తింపు కార్డు లేదా, జనన ధ్రువీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్, ఫొటో తీసుకుని మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉన్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.