షాబాద్ : రంగారెడ్డి జిల్లాలో కేజీబీవీల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఏఎన్ఎం, అకౌంటెంట్లుగా పని చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుసీందర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం జిల్లాలో ఏఎన్ఎం-05, అకౌంటెంట్ -07 ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఏఎన్ఎంకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్తో పాటు ఏఎన్ఎం శిక్షణ పొందిన సర్టీఫికేట్ ఉండాలన్నారు. అకౌంటెంట్ కోసం గ్రాడ్యుయేట్ కామార్స్, ఎంకమ్ సర్టిఫికెట్, బికమ్ కంప్యూటర్, బేసిక్ కంప్యూటర్ కలిగి కోర్సులు కలిగి ఉండాలన్నారు. 01-07-2021 నాటికి 18ఏండ్లు నిండి, 44ఏళ్ల లోపు వారై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5సంవత్సరాలు, వికలాంగులకు 10సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుందన్నారు.
అభ్యర్థులు రంగారెడ్డి జిల్లాకు (కొత్త జిల్లా ప్రాతిపదిక) చెందిన వారై ఉండాలని చెప్పారు. దరఖాస్తు ఫారం కోసం www.deorangareddy.comను సంప్రదించగలరని తెలిపారు. కావున అర్హులైన మహిళా అభ్యర్థులు తమ అర్హత గల సర్టీఫికేట్స్తో(గెజిటెడ్ అధికారి అటెస్టెడ్ కాఫీలు) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బదూర్గూడ, ఎల్.బి.నగర్ నందు ఈ నెల 31వ తేది నుంచి ఫిబ్రవరి 5వ తేది వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు ఫారములు అందజేయాలన్నారు. మరిన్ని వివరాల కోసం 8309009920/9912742314 నంబర్లకు సంప్రదించాలన్నారు.