షాద్నగర్, జూన్ 15 : ఉమ్మడి రాష్ట్రంలో పల్లె ప్రగతిని అప్పటి ప్రభుత్వాలు విస్మరిస్తే నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పల్లెల్లో ప్రగతి పరుగు పెడుతుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం నందిగామ, ఎలికట్ట గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాడు గ్రామాలకు వెళ్లాంటే ముండ్ల పొదలు, చెత్త కుప్పలు, మురుగు నీరును దాటుకొని పోయేవాళ్లమని, మురుగు నీరంత ఇండ్ల ముందు పారుతుండేదని గుర్తు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ దృడసంకల్పంతో చేపట్టి పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను కల్పించామని వివరించారు. అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు, ఫరూఖ్నగర్, నందిగామ, కొత్తూరు, కేశంపేట, చౌదరిగూడ మండలాల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. గ్రామస్తులతో కలిసి మానవ హారాలను నిర్వహించి ఐక్యతను చాటారు. మహిళలు ముగ్గులను వేసి ఆకట్టుకున్నారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను మామిడి తోరణాలతో, పూలమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
పల్లెలు దేశానికి ఆదర్శం
మంచాల : పల్లెప్రగతితోనే గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మంచాల మండలం లోయపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. లోయపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ. 4 కోట్లు కేటాయించామని, అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మరో రూ. 20 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లంకి అనిత, ఎంపీపీ నర్మద, వైస్ ఎంపీపీ రాజేశ్వరి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ అనిత, ఎంపీడీవో శ్రీనివాస్, డీఈ అబ్బాస్, ఏఈ సాయినాథ్ గౌడ్ పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి
ఆమనగల్లు : పల్లె ప్రగతి దేశ ప్రగతి అని, అన్ని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఆమనగల్లు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తమ సేవలు అందించిన వారిని సన్మానించారు. రాంనూంతల గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రూ.20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, సర్పంచ్ సోన, ఎంపీటీసీ సరిత, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు పత్యానాయక్ తదితరులు ఉన్నారు.
కడ్తాల్ : కడ్తాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులచే తెలంగాణ నమూనా చిత్రీకరించి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం, ఇతర అభివృద్ధి పనులను గ్రామ ప్రజలు , విద్యార్థులచే కలిసి ర్యాలీగా వెళ్లి పరిశీలించారు. రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆన్మాస్పల్లి గ్రామంలో రూ.80 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులు, రూ.20 లక్షలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన , రూ 42 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంక్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, ఉప సర్పంచ్ రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు జోగు వీరయ్య, లాయక్ అలీ, నరేందర్ రెడ్డి, బిక్షపతి, మహేశ్, గణేశ్, రామచందర్, మంకీ శ్రీను తదితరులు ఉన్నారు.
మాడ్గుల : ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన కార్మికులకు బూట్లు , 2 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాఘవులు, అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండలంలోని 32 గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి , వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన పల్లెప్రగతి దినోత్సవాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంచాల, యాచారం మండలాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామపంచాయతీలను అందంగా అలంకరించారు. రంగురంగుల విద్యుత్దీపాలు, మామిడి తోరణాలతో గ్రామపంచాయతీలను అలంకరించారు. సిబ్బందిని సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామప్రజలకు సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు.
పల్లెలన్నీ అభివృద్ధి పథంలో.
ఇబ్రహీంపట్నంరూరల్ : పల్లెలు సీఎం కేసీఆర్ చొరువతో దేశానికే ఆదర్శంగా నిలబడుతున్నాయని ఎంపీపీ కృపేశ్, వైఎస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి అన్నారు. మండల వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించారు. ఎలిమినేడు, ఉప్పరిగూడ గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి ఉత్సవాల్లో ఎంపీపీ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంరెడ్డి, అశోక్రెడ్డి, హంసమ్మ, యాదగిరి, పవిత్ర, గీత, కవిత, బల్వంత్రెడ్డి, జ్యోతి, మల్లీశ్వరి, భాస్కర్, ఆండాళు, జగన్, ఎంపీటీసీలు భరత్రెడ్డి, ఆంజనేయులు, శ్రీశైలం, జ్యోతి, అనసూయ, అరుణమ్మ, మంగమ్మ, నాగమణి పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట్: కుత్బుల్లాపూర్, తారామతిపేట, గౌరెల్లి గ్రామాల్లో పల్లెప్రగతి దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్మికులను ప్రజాప్రతినిధులు, అధికారులు సత్కరించారు. ప్రజలకు మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.
అబ్దుల్లాపూర్మెట్ : గ్రామపచాయతీల ముందు ఉదయం సర్పంచ్లు జెండాలను ఎగురవేశారు. గ్రామసభలు నిర్వహించి పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రేఖ, జడ్పీటీసీ దేవదాసు, వైస్ఎంపీపీ శ్రీధర్రెడ్డి, ఎంపీడీవో మమతాబాయి, వినోద, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పల్లెప్రగతి ఆదర్శం
షాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్వతో ముఖాభివృద్ధి కోసం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ముద్దెంగూడ గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పల్లెప్రకృతి వనంలో మొక్కలను పరిశీలించారు. రాగి చెట్టుకు పూజలు చేశారు. పంచాయతీ కార్మికులు, ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు, ఆశవర్కర్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదే విధంగా శంషాబాద్కు చెందిన నందీశ్వర్గౌడ్ తెలంగాణ పల్లెప్రగతిపై తయారు చేసిన పాటల సీడీని జడ్పీటీసీ ఆవిష్కరించారు. అనంతరం నందీశ్వర్గౌడ్ను అవినాశ్రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, సర్పంచ్ కుర్వ జయమ్మ, ఎంపీడీవో అనురాధ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, ఎంపీవో హన్మంత్రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ పర్వేద నర్సింహులు, మాజీ సర్పంచ్ భూపతి రాజేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుదర్శన్, పాపిరెడ్డి, లింగం, పోచమ్మ, సత్యనారాయణ, శ్రీశైలం పాల్గొన్నారు.
శంకర్పల్లి : పంచాయతీ, పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేసి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాల వద్ద ఏర్పాటు చేసిన వన భోజనాల్లో పాల్గొని సహపంక్తి భోజనాలు చేశారు. మీర్జాగూడ, జనవాడ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, సర్పంచ్లు రవీందర్ గౌడ్, సత్యనారాయణ, సుమిత్ర మోహన్రెడ్డి, ఎంపీడీవో వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. తల్లారం, కౌకుంట్ల గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవానికి డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో పేరుకుపోయిన సమస్యలు సీఎం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పరిష్కరించబడ్డాయన్నారు. అనంతరం పంచాయతీ, పారిశుద్ధ్య కార్మికులకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. వన భోజన కార్యక్రమంలో పాల్గొని భోజనాలు చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింహులు, సర్పంచ్లు గూడెం సురేందర్, గాయత్రీగోపాల కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు, రోషన్, దేవేందర్గౌడ్, మాజీ సర్పంచ్ పండరి గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్, ఆశవర్కర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
తంగడిపల్లి, అంతారం, ఈర్లపల్లిలో..
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంతారం, తంగడిపల్లి, ఈర్లపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు సులోచనాఅంజన్గౌడ్, అనూష సత్తయ్యగౌడ్, ముత్తంగి రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శులు సురేందర్ రావు, అనూష, ఉప సర్పంచ్లు అనసూయ, జయలతాబాల్రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలు, ఆశవర్కరు పాల్గొన్నారు.
మొయినాబాద్ : సర్పంచ్ల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పంచాయతీ సిబ్బందికి దుస్తులు అందజేసి ఉత్తమ సేవలను అందించిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. వన భోజనాలు చేశారు.