షాద్నగర్టౌన్, డిసెంబర్ 6: మన దేశ ఘనకీర్తిని ప్రపంచ దేశాలకు చాటడమే కాకుండా భారత దేశ రాజ్యాంగాన్ని రచించి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సోమవారం పట్టణ ముఖ్య కూడలిలో, మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశాడన్నారు. అదే విధంగా మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డితో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శరత్బాబు, ఎంఈవో శంకర్రాథోడ్, మండల వ్యవసాయ అధికారి నిశాంత్కుమార్, కౌన్సిలర్ నర్సింహ, అంతయ్య, శ్రీనివాస్, మాజీ చైర్మన్ విశ్వం, మండల అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, నాయకులు నారాయణ, చెట్ల నర్సింహ, జూపల్లి శంకర్, శేఖర్, కిశోర్, జమృత్ఖాన్, రాఘవేందర్, శరత్కృష్ణ పాల్గొన్నారు.
అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి : ఎమ్మెల్యే యాదయ్య
చేవెళ్లటౌన్ : అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలలో వెలుగు నింపిన ఆశాజ్యోతి అంబేద్కర్ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….సమాజంలో నెలకొన్న అంటరానితనం పై జీవితాంతం పోరాడిన మహనీయుడు అని గుర్తు చేశారు. అంబేద్కర్ అందరివాడని డీసీ సీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, సర్పంచ్ బండారి శైలజ, బీజేపీ మండల అధ్యక్షుడు పాండు రంగారెడ్డి అన్నా రు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి, చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశ్, అనంతరెడ్డి, నాయకులు ఆగిరెడ్డి ఉన్నారు.
అంబేద్కర్కు ఘన నివాళి
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, టీఆర్ఎస్ నాయకులు, ఆయా కుల సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, శ్రీధర్రెడ్డి, బాబురావు, నర్సింగరావు, రాంచంద్రయ్య పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి
షాబాద్ : అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంకెపల్లిగూడ, నాగరగూడ గ్రామాల సర్పంచ్లు దర్శన్, ఈదుల కృష్ణగౌడ్ అన్నా రు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండలంలోని సంకెపల్లిగూడ, నాగరగూడ, షాబాద్, బోడంపహాడ్ తదితర గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తి సునీత, బోడంపహాడ్ సర్పంచ్ కృష్ణారెడ్డి, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు తొంట వెంకటయ్య, సోషల్ మీడియా అధ్యక్షుడు ఎండీ ఇనాయత్, పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
చేవెళ్ల రూరల్ : ఊరెళ్ల గ్రామంలో వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జహంగీర్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పెంజర్ల గ్రామంలో..
కొత్తూరు రూరల్ : అంబేద్కర్ ఆశయ సాధన కో సం కృషి చేయాలని పెంజర్ల సర్పంచ్ మామిడి వసుంధర అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వివిధ గ్రామాల్లో పార్టీలకతీతంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంబేద్కర్ జీవితం ప్రపంచానికి మార్గదర్శకం
మొయినాబాద్ : అంబేద్కర్ జీవితం ప్రపంచానికి ఆదర్శమని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేగరి రాజు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. సురంగల్, నాగిరెడ్డిగూడ, అమ్డాపూర్, కనకమామిడి, హిమాయత్నగర్, చిలుకూరు, చిన్నమంగళారం, మేడిపల్లి, తోలుకట్టా, వెంకటాపూర్ గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. గునుగుర్థి జయవంత్, అన్వర్ఖాన్, అరవింద్, శివకుమార్, డేవిడ్, మాణిక్యం, రాజు, శ్రీశైలం, మిట్టు, కె శ్రీధర్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మండల వ్యాప్తంగా..
శంకర్పల్లి : శంకర్పల్లిలో మున్సిపల్ వైస్ చైర్మ న్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు చంద్రమౌళి, నాయకులు సాత ప్రవీణ్కుమార్, బీ.అశోక్, వెంకటయ్య, పార్శి బాలకృష్ణ, మధు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టంగటూరు సర్పంచ్ గోపాల్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జంగయ్య, ఉప సర్పంచ్ మంగమ్మ, సత్యనారాయణ, వార్డు సభ్యులు ఎన్.గోపాల్, రంగారెడ్డి, వెంకటయ్య, జనార్దన్, శ్రీశైలం తదితరులు నివాళులర్పించారు.