ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు బాధితులకు బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం రిలిఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన శివకు రూ. 32వేలు, పెద్దపూర్ గ్రామానికి చెందిన వినోదకు రూ. 40వేలు మంజురయ్యాయి. ఇటీవల బాధితులు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎమ్మెల్సీని ఆశ్రయించి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. బాధితులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.