ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లోని రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాలకమండలి సభ్యులు చొరవచూపాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులకు సూచించారు. మంగళవారం ఇటీవల నియమితులైన ఆమనగల్లు ఏఎంసీ సభ్యులు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోటగిరియాదవ్, డైరెక్టర్లు సుభాశ్, రమేశ్, లాయక్అలీ, నర్సింహ, తిరుమల్రెడ్డి, శేఖర్, నిరంజన్ పాల్గొన్నారు.