ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లోని వ్యవసాయ అధికారులతో శనివారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆమనగల్లు ఏఓ అరుణకుమారి, కడ్తాల ఏఓ శ్రీలత, తలకొండపల్లి ఏఓ రాజు, మాడ్గుల ఏఓ గౌతమ్తో పాటుగా పంచాయతీరాజ్శాఖ డీఈ తిరుపతిరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో భాగంగా ఆయా మండలాల్లో రైతువేదికల నిర్మాణం, అసంపూర్తి పనులు, పంటల మార్పిడి విధానం, రైతు వేదికల ప్రారంభోత్సవాలకు సంబంధించి పలు విషయాలపై ఆయన అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఆయా గ్రామాల్లో పూర్తి అయిన రైతు వేదికలను దీపావళీ పండుగ అనంతరం ప్రారంభోత్సవాలను నిర్వహించుకొనేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా మండలాల్లో రైతువేదికల్లో అసంపూర్తి పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు.