ఆమనగల్లు (మాడ్గుల) : రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సొంత నిధులతో సమకూర్చిన డిక్షనరీలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదుగాలన్నారు. నిరుపేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం అవురుపల్లి గ్రామానికి చెందిన బాధితరాలు మల్లమ్మకు సీఎం రిలిఫ్ఫండ్ చెక్కును అందజేశారు.
ముర్తుజపల్లిల్లో బాధిత కుటుంబానికి పరామర్శ
ఇటీవల చెన్నంపల్లి గ్రామ సమీపంలో హత్యకు గురైన పోషమ్మ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. హత్యకు సంబంధించిన విషయాలను ఆరా తీసి బాధిత కుటుంబానికి రూ. పదివేల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ఉప్పల్ ట్రస్టు సభ్యులు రూ. 3వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు అంబాల జంగయ్య, యాదగిరిరెడ్డి, ఎంపీటీసీ జైపాల్రెడ్డి, మాజీ జడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ జైపాల్నాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు కృష్ణారెడ్డి, రాములు, శంకర్, ఖలీల్ పాల్గొన్నారు.