ఆమనగల్లు : ఆమనగల్లు మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ బీజేపీ కార్యకర్తలను ఆహ్వానించి పార్టీ కండువాలను కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే సెక్యూలర్ పార్టీ టీఆర్ఎస్ అని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా పలువురు కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్ వైపు అడుగులు వేయడం శుభపరిణామం అన్నారు.
పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ కార్యకర్తలు వేణుగోపాల్రెడ్డి, యాదిరెడ్డి, జంగయ్య, నరేష్, గణేష్, శ్రీకాంత్, పృథ్వి, మౌలాన, రాజు, రాంరెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీ అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అర్జున్రావు, శంకర్, వెంకటయ్య, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.