మౌలిక వసతులు కల్పించిన పూర్వవిద్యార్థులు దాదాపు రూ.లక్ష వ్యయంతో 110 బెంచీల అందజేత
ఉపాధ్యాయులూ చందాలు పోగుచేసి తాగునీటి బోరు ఏర్పాటు
విద్యాభిమానుల సహకారంతో లైబ్రరీ,సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసిన ఓ ఇంజినీర్
దాతల సహకారంతో కొడంగల్ పట్టణంలోని జడ్పీ పాఠశాలలో సకల సౌకర్యాలు
కొడంగల్, ఫిబ్రవరి 6: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాతల సహకారంతో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ.. ఆ పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు, విద్యాభిమానులు, యువకులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి తమకు తోచిన విధం గా సాయం అందిస్తున్నారు.
పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలకు పలువురు దాతలు ముందుకొచ్చి విద్యార్థులు, పాఠశాల అవసరాలను గుర్తించి వసతులను కల్పించి తమ ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. పాఠశాలలో దాదాపు 630 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా ఈ ఏడాది ప్రత్యేక దృష్టి సారించి ఇంగ్లిష్ మీడియంలో 38 మంది విద్యార్థినులను చేర్చినట్లు హెచ్ఎం రాంరెడ్డి తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారిలో చాలామంది స్థానికులతోపాటు గతంలో ఇదే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కావడంతో వారు పాఠశాల అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటున్నారు. పాఠశాల ఆవరణలో గత మూడేండ్లుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా దాదాపు 1500 మొక్కలు నాటి వాటి ని సంరక్షిస్తున్నారు. ఆ మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి. దీంతో పాఠశాల పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతున్నా యి. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పౌష్టికారం అందించేందుకు పాఠశాల ఆవరణలో ఆకు, కూరగాయలను పండిస్తున్నారు.
దాతల సహకారంతో మౌలిక వసతులు
ఉపాధ్యాయులు కొత్తగా నిర్మించిన భవనంతోపాటు శిథిలావస్థకు చేరిన తరగతి గదుల్లో జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. తాము చదువుకున్న సరస్వతీదేవి నిలయాన్ని మరింత అభివృద్ధి చేసేందు కు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులతోపా టు విద్యాభిమానులు ముందుకొచ్చారు. పాఠశాలలో ఆయా వసతులను కల్పిస్తున్నారు. బడిలో ఉన్న బెంచీలు పూర్తిగా పాడై కేవలం ఇనుప ఫ్రేమ్లు మాత్రమే మిగలడంతో వా టిని ఓ తరగతి గదిలో భద్రపరిచారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు రవీందర్గౌడ్ చొరవతో యూత్ సేవా సమితి వా రు పాఠశాలకు దాదాపు రూ.లక్ష వ్యయంతో 110 బెంచీలకు అవసరమైయ్యే పరికరాలను అందించారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెచ్ఎంతోపాటు గోపీనాథ్, నర్సింగ్, ఏసురత్నం, ఆనంద్రావు, ఉమాలాల్, మరికొంత మంది ఉపాధ్యాయులు కలిసి ప్రతి ఒక్కరూ రూ. వేయి చొప్పున పోగు చేసుకొని బెంచీల మరమ్మతులతోపాటు నీటి సౌకర్యం కోసం బోర్ వేయించారు. విద్యాభిమాను లు అంజిలప్ప, యాదగిరి, శరాఫ్ శ్రీనివాస్ రూ.50 వేలతో గ్రంథాలయ పుస్తకాలను సమకూర్చారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్వేత రూ.60వేలతో సైన్స్ ల్యాబ్ కోసం పరికరాలను అందజేశారు. ఈ పాఠశాలలో గతంలో విధులు నిర్వహించిన విశ్రాంత ఉపాధ్యాయురాలు శీలాదేవి రూ.25 వేలు ఖర్చు చేసి బోర్ మోటార్ను బిగింపజేశారు. జయేందర్ రూ.20 వేలతో ఇన్వెంటర్ను బహూకరించారు. రూ.6వేలతో షఫీ డిజిటల్ డిష్ అంటీనా అందజేశారు. మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి రూ. 25 వేలతో పాఠశాల భవనం ఎదుట స్టేజీని ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నా రు. ఉపాధ్యాయుల చొరవ కూడా అభినందనీయం.
గతంలో సౌకర్యాలు తక్కువ..
గత మూడేండ్ల క్రితం పాఠశాలకు హెచ్ఎంగా వచ్చినప్పుడు సౌకర్యాలు చాలా తక్కువగా ఉండేవి. శిథిలావస్థకు చేరిన తరగతి గదులను తొలగిం చి విశాలమైన ఆవరణను ఏర్పాటు చేసుకున్నాం. పాఠశాల ఆవరణను పచ్చదనంగా తీర్చిదిద్దేందుకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వివి ధ రకాల 1500 మొక్కలను నాటి సంరక్షిస్తున్నాం. ప్రస్తు తం అవి ఏపుగా పెరుగడంతో పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణ ఏర్పడింది. దాతలు ముందుకు రావడంతో విద్యార్థులకు అవసరమయ్యే అన్ని వసతులను కల్పిస్తున్నాం. ఉపాధ్యాయుల చొరవ కూడా అభినందనీయం.
– రాంరెడ్డి, హెచ్ఎం, ఎంఈవో, జడ్పీహెచ్ఎస్, కొడంగల్
పాఠశాల రుణం తీర్చుకునే అవకాశం..
ఈ పాఠశాలలోనే చదివి, ఉన్నత విద్యను అభ్యసించి, ఇక్కడే ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉన్నది. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నాం. ప్రస్తుతం పాఠశాలలో ఉపాధ్యాయులుగా కొనసాగుతు న్న వారిలో చాలామంది ఈ పాఠశాల పూర్వ విద్యార్థులే ఉన్నారు. పాఠశాల రుణాన్ని తీర్చుకునే మంచి అవకాశం మాకు వచ్చింది.
– గోపీనాథ్, ఉపాధ్యాయులు, జడ్పీ హెచ్ఎస్