పెద్దఅంబర్పేట, సెప్టెంబర్ 20: పేదల ఎన్నో ఏండ్ల సొంతింటి కల సాకారమవుతున్నది. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారం, హత్తిగూడ, అబ్దుల్లాపూర్మెట్టు మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామపంచాయతీ తిమ్మాయిగూడలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. గురువారం మంత్రులు మహమూద్అలీ, సబితారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు.
ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేదికతోపాటు లబ్ధిదారులు కూర్చునేందుకు వీలుగా వసతులు కల్పించారు. కాగా, తట్టిఅన్నారంలోని సముదాయంలో మొత్తం ఏడు బ్లాకులు ఉండగా.. 1268 ఫ్లాట్లు ఉన్నాయి. హత్తిగూడలో 432 ఫ్లాట్లు, తిమ్మాయిగూడలో 600 ఫ్లాట్లు ఉన్నాయి. మహేశ్వరం నియోజకవర్గం మనసాన్పల్లిలో 800 ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.