శంకర్పల్లి, డిసెంబర్ 28 : ప్రభుత్వం అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నదని తహసీల్దార్ నయిద్దీన్ అన్నారు. బుధవారం మండలంలోని మిర్జాగూడ, జనవాడ గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి డబుల్ బెడ్ రూం ఇండ్లకు అర్హులను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు.
మిర్జాగూడ గ్రామంలో 120 మంది దరఖాస్తు చేసుకోగా ఐదుగురిని అర్హులుగా గుర్తించారు. జనవాడ గ్రామంలో 584 మంది దరఖాస్తు చేసుకోగా 18 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్గౌడ్, జనవాడ సర్పంచ్ లలిత, ఆర్ఐలు విక్రమ్, తేజ, కార్యదర్శి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.