రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్రోడ్డుపై బొంగ్లూరు జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా యెల్కిచర్లకు చెందిన మల్లాయపల్లి శ్రీనివాస్రెడ్డి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 9గంటలకు బొలెరో వాహనం తీసుకొని తన బంధువు వంశీధర్ రెడ్డితో కలిసి నగరంలోని ఆటోనగర్లో లోడు నింపేందుకు బయలుదేరారు.
బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో బొంగ్లూర్ ఔటర్ ఎగ్జిట్ నెంబర్ 12 వద్ద ఇండికేటర్ లేకుండా టిప్పర్ నిలిపి ఉంది. దీంతో బొలెరో వాహనం టిప్పర్ను వెనక నుంచి ఢీకొట్టింది. డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి తలకు బలమైన గాయాలుకావడంలో అక్కడికక్కడే మృతిచెందగా వంశీధర్రెడ్డి గాయాలతో బయటపడ్డాడు. మృతదేహా న్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి వెంకట్రెడ్డి ఫిర్యాదుతో పొలీసులు నిర్లక్ష్యంగా వాహనం నిలిపి ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ బాల్రాజ్పై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్రెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.