రంగారెడ్డి : జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి మన్నెగూడ సాగర్ హైవే పక్కనే ఉన్న జేజే టైర్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగతో మంటలు ఎగిసి పడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో దుకాణంలోని సామగ్రి అంతా కాలిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.