ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 19 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి మరింత అభివృద్ధి పనులు చేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృపేశ్ అధ్యతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. వ్యవసాయం, ఉద్యానవనం, విద్య, వైద్యం, పశుపోషణ, తాగు, సాగునీరు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, రోడ్లు భవనాలు, ఎక్సైజ్, ఆర్టీసీ, ఉపాధిహామీ, ఐకేపీతో పాటు పలు రకాల శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా త్వరలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని భూములు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నామన్నారు. అందులో భాగంగానే త్వరలో రూ.8 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు కానున్నాయని, ఈ నిధులతో ప్రతి గ్రామంలోని ఇంకా మిగిలిన మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించనున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీపీ కృపేశ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కిషన్రెడ్డి ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయలు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశామన్నారు. 90శాతం రాయితీపై ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సహిస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్యానవన అధికారిణి కనకలక్ష్మి తెలిపారు. సమావేశంలో వైస్ ఎంపీపీ వెంకటప్రతాప్రెడ్డి, ఎంపీడీవో వెంకటమ్మ, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఆయాశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రైతుల శ్రేయస్సే ధ్యేయం
తుర్కయాంజాల్ : రైతుల శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన ధ్యేయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ రైతుసేవా సహకార సంఘం 49వ మహా సభ మంగళవారం సంఘం చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షతన సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొహెడ వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.450 కోట్లను విడుదల చేసిందని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ సీఈవో శ్రీనివాస్, రైతుసేవా సహకార సంఘం వైస్ చైర్మన్ రాంరెడ్డి, డైరెక్టర్లు సంజీవరెడ్డి, రాంరెడ్డి, లక్ష్మమమ్మ, స్వప్న, యాదగిరి, సత్యనారాయణరెడ్డి, సంఘం సీఈవో రాందాస్, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్ పాల్గొన్నారు.