పరిగి, జనవరి 26: పరిగి నియోజకవర్గంలో శుక్రవారం గణతంత్ర వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖల, ప్రైవేటు కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పరిగిలోని మున్సిఫ్కోర్టు వద్ద ఇన్చార్జి జూనియర్ సివిల్ జడ్జి శృతి దూత, క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, తమ నివాసం ఆవరణ లో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి , ఆయా ప్రభుత్వ కార్యాలయాలపై అధికారులు జాతీ య పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. పరిగిలోని మిని స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకు న్నాయి. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గాన్ని రూ.10వేల కోట్లతో అన్ని రంగాలలో అభివృద్ది చేస్తానని తెలిపారు. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు పదిహేను రోజులలో ప్రారంభమవుతాయని అన్నారు. నేవీ రాడార్ కేంద్రం సైతం మంజూరైందన్నారు. పరిగి నుంచి షాద్నగర్ వరకు జాతీయ రహదారి ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని చెప్పారు.
పరిగిలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కె.శ్యాంసుందర్రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సిద్దాంతి పార్థసారథి, ఎస్పీ బాబయ్య, ఎ.సురేందర్, ఆర్.ఆంజనేయులు, బి.ప్రవీణ్కుమార్రెడ్డి, తహసీల్దార్ రామారావు, ఎంపీడీవో శేషగిరిశర్మ తదితరులు పాల్గొన్నారు. పూడూరు మండల కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల, పీఏసీఎస్ చైర్మన్ సతీష్రెడ్డి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో ఉమాదేవి, కులకచర్లలో జరిగిన వేడుకలలో ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్, తహసీల్దార్ మురళీధర్, పీఏసీఎస్ చైర్మన్ నాగరాజ్, స్థానిక సర్పంచ్ సౌమ్య వెంకట్రామిరెడ్డి, ఎంపీడీవో నాగవేణి, నాయకులు శేరి రాంరెడ్డి, హరికృష్ణ, కృష్ణగౌడ్, వెంకటేశ్, దోమ మండల కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీపీ అనుసూయ, తహసీల్దార్ పురు షోత్తం, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తాండూరు: తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని ప్రభుత్వ కార్యా లయాలు, ఆస్పత్రులు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, పాఠశాల, కళాశాలలపై నేతలు, అధి కారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణ ఆకట్టుకుంది. దేశ భక్తి ఉట్టిపడేలా మార్చ్ఫాస్ట్తో పాటు దేశ భక్తి పాటలు, నినాదాలు హోరెత్తాయి. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సామూహిక రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు కన్న కలలు నిజం చేయడానికి మనం కంకణ బద్దులం కావాల న్నారు.
మన దేశంలో సర్వమతాలు, కులాల వారు ఎంతో సమైక్యతతో కలిసి మెలసి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో తాండూరును మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్రావు, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, రాజకీయపార్టీల నేతలు, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి నియోజకవర్గంలోని సర్పంచ్లను ఘనంగా సన్మాంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని తెలి పారు. అందుకు సంహకరించిన ప్రజా ప్రతినిధులుకు కృతజ్ఞతలు తెలిపారు. 24 గంటలకు తాండూరు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు.
వికారాబాద్: నియోజకవర్గంలోని వికారాబాద్, ధారూరు, మోమిన్పేట, బం ట్వారం, కోట్పల్లి, నవాబుపేట, మర్పల్లి మండలాల్లో విద్యార్థులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆనంద్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుధాకర్రెడ్డి, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చైర్మన్లు, ప్రిన్సిపాళ్లు జెండావిష్కరణ చేశారు.
అదే విధంగా ఎంపీపీలు, జడ్పీటీలు, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు జెండావిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దేశ నాయకుల వేషాధారణలో చిన్నారులు అందంగా అలరించారు. ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ జెండావిష్కరణ చేశారు. అనంతరం గౌరవ వందనం చేశాసి, జాతీయ గీతాన్ని ఆలపలించారు.
కొడంగల్: నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లో గణతంత్ర వేడు కలను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని కడా కార్యాలయంలో మొదటి సారిగా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి జెండా ఎగరవేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని మార్కెట్యార్డ్, ఫైర్ స్టేషన్, ఎంపీడీవో, పీఏసీఎస్, మున్సిపల్, తహ సీల్దార్ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ జనవరి 26 చారిత్రకమైన రోజని, రాజ్యాంగం అమలుతో సంపూర్ణ స్వరాజ్యంగా ప్రకటించుకోవడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. పట్టణంలో క్రేన్ యజమానులు, డ్రైవర్లు దేశభక్తిని చాటుతూ క్రేన్ సాయంతో భారీ జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, ఎంపీడీవో పాండు, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంఈవో రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, సీడీపీవో జయరాంలతో పాటు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, ఆయాశాఖల అధికారులు, బొంరాస్పేట ఎంపీడీవో హెమీబాయి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.