మోమిన్పేట : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి అందరి చూపు బీఆర్ఎస్ వైపే మళ్లిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మల్లారెడ్డి, ఇజ్రాచిట్టెంపల్లి కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ పాండునాయక్, పీఏసీఎస్ డైరెక్టర్, బీజేపీ నాయకులు, ఎన్కతల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు 60 మంది మంగళవారం మోమిన్పేటలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి ఇతర పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లోకి వలస బాట పడుతున్నారన్నారు. పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సంక్షేమ పథకాలను, మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులున్నారు.
పార్టీ బలోపేతానికి కృషి
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండలంలోని తంగడపల్లి గ్రామం నుంచి 100 మంది కార్యకర్తలు, న్యాలట గ్రామం నుంచి 70 మందికి పైగా కార్యకర్తలు ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉండడమే కాకుండా వారిని కాపాడుకుంటుందన్నారు. అందరం కలిసికట్టుగా పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, చేవెళ్ల వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యారెడ్డి, బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు రాములు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శివారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివనీల చింటు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు రవికాంత్రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రామాగౌడ్, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు, సర్పంచ్లు, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫయాజ్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఘనీ, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జైపాల్రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష
షాద్నగర్రూరల్ : రాష్టంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని కంసాన్పల్లి, భీమారం, పలు గ్రామాల్లోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ గ్రామాల్లోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లోకి వలసలు వస్తుడటంతో షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అయిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు వ్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. తెలంగాణ రాష్ర్టంలో అమలవుతున్న సంక్షేమ ఫథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ర్టంలో సంక్షేమ ఫథకాలు అందని గడప లేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను గడపగడపకు వివరించాలన్నారు. గ్రామాలు, తండాలు మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని కంసాన్పల్లి గ్రామంలోని కాంగ్రెస్ నాయకులందరూ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడంతో దాదాపు కాంగ్రెస్ క్లీన్ స్వీప్గా మారిందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం
కొత్తూరు : బీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ తిరిగి మఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో పలువురు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పరిధిలోని ఇన్ముల్నర్వలో కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ ఆధ్వర్యంలో యువత బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు నాయకులు తెలిపారు.