కొత్తూరు, జూలై 29 : నియోజకవర్గంలో నూతన రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని జేపీ దర్గా నుంచి కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట వరకు రూ. 6 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక మండల నుంచి ఇంకో మండలానికి నూతన రోడ్లను అనుసంధానించడం ద్వారా రాక పోకలు పెరుగుతాయన్నారు. గతంలో నిర్మించిన ఈ రోడ్డు పూర్తిగా పాడైందని, దాని స్థానంలో కొత్త రోడ్డు వేస్తున్నామని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల వాహనదారుల ఇబ్బందులు తొలుగుతాయని ఆయన వివరించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే కేశంపేట మండలం నుంచి హైదరాబాద్కు ప్రయాణం సులభమవుతుందని ఆయన వివరించారు. రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నా ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఇన్చార్జి ఎంపీపీ శోభ, సర్పంచ్ అజయ్నాయక్, ఎంపీటీపీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, పెంటనోళ యాదగిరి, లింగంనాయక్, గోపాల్నాయక్, నరసింహారెడ్డి, జైపాల్, రసీద్, మహేశ్, రమేశ్ పాల్గొన్నారు.
జేపీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
మండల వ్యాప్తంగా మొహర్రాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జేపీదర్గాలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. మొదటగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముస్లింలతో కలిసి చాదర్ తీసుకెళ్లి దర్గాలో సమర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత కడప పెద్దదర్గా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాయసాన్ని పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పీర్ల పండుగ సందర్భంగా చావిడీలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
కో ఆర్డ్డినేటర్గా నరసింహారెడ్డి
కొత్తూరు రైతు సమన్వ య కమిటీ కో ఆర్డినేటర్గా కళ్లెం నరసింహారెడ్డిని ఎమ్మెల్యే నియమించారు. ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
కొత్తూరు : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని కొడిచెర్ల తండా పంచాయతీ ఖాజగూడ ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపీటీసీ నిధుల నుంచి ఈ ప్రహరీ నిర్మాణ పనులు జరుగునున్నాయి.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కేశంపేట : జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రెస్ క్లబ్ల నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులను మంజూరు చేయించడం పట్ల జర్నలిస్టులు శనివారం ఎమ్మెల్యే స్వగ్రామమైన ఎక్లాస్ఖాన్పేటలో అంజయ్యయాదవ్ను సన్మానించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే-143 జిల్లా అధ్యక్షుడు శేఖర్సాగర్, నియోజకవర్గ అధ్యక్షుడు కె.కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు శివకుమార్, సీనియర్ నాయకులు మోహన్రెడ్డి, రంగనాథ్, సంజయ్, ఖాజాపాషా, వేణుగోపాల్, రాఘవేందర్గౌడ్, కన్నప్ప, హరిజీవన్, చందు తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నందిగామ : రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. చేగూరు గ్రామానికి చెందిన కొంగరి శేఖర్ కొన్ని రోజుల క్రితం మృతి చెందడంతో మృతుడి భార్య మంజులకు రైతుబీమా పథకం ద్వారా వచ్చిన రూ.5 లక్షల ప్రొసీడింగ్ను శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, పీఏసీఎస్ చైర్మన్ తోట రాజ్గోపాల్, మాజీ చైర్మన్ విఠల్, శేఖర్, శేఖర్చారి తదితరులు పాల్గొన్నారు.