మహేశ్వరం, నవంబర్ 8 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. బుధవారం మహేశ్వరం, గొల్లూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి 50 మంది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు. గ్రామ స్వరాజ్యమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమన్నారు. కరెంటు కష్టాలు, స్కాంల కాంగ్రెస్ కావాలా, సంక్షేమం అందించే బీఆర్ఎస్ పార్టీ కావాలా ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు.
తాండూరు, నవంబర్ 8: తాండూరు అభివృద్ధి ప్రధాతగా బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. బుధవారం రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్శంకర్ గులాబీ పార్టీ కండువ కప్పుకున్నారు. ముస్లిం యూత్ రోహిత్రెడ్డి మేము సైతం అంటూ బీఆర్ఎస్లో చేరారు. అత్యధిక మెజార్టీతో రోహిత్రెడ్డిని గెలిపిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ గెలుపుకు గులాబీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజల్లో తీసుకుపోవాలని రోహిత్రెడ్డి సూచించారు. సంపూర్ణంగా అందరు మద్దతు తెలుపడం సంతోషంగా ఉందన్నారు.
బషీరాబాద్ : ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి సమక్షంలో మండల పరిధిలోని కాశీంపూర్ గ్రామస్తులు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ వెంకటయ్య, నాయకులు మాణిక్రెడ్డి, ఆశోక్గౌతమ్, తదితరులు ఉన్నారు.