కల్వకుర్తి, నవంబర్ 8: అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి రెండు కళ్లని బీఆర్ఎస్ అభ్యర్థి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కల్వకుర్తి మండలం లింగసానిపల్లికి చెందిన వందమంది, వెంకటాపూర్ గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం రాష్ట్ర అభివృధ్ధి, తెలంగాణ సంక్షేమం కోసం పాటు పడుతున్నారన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో అభివృద్ధిలో తెలంగాణ రూపురేఖలే మారిపోయాయన్నారు. ఆ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు, ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ విజయ్గౌడ్, ఎంపీపీ మనోహర, వైస్ ఎంపీపీ గోవర్ధన్, యాదయ్య, నరేందర్ , శంర్నాయక్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుర్తి అసెంబ్లీ బరిలో ఉన్న ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్కు ఎన్నికల ధరావతు(డిపాజిట్)ను బుధవారం కల్వకుర్తి గ్రామ పంచాయతీ రైతు, ఉపసర్పంచ్ రాంరెడ్డి, రూ.10వేలు అందజేశారు. అనంతరం రాంరెడ్డి మాట్లాడుతూ తన ప్రధాన వృత్తి వ్యవసాయమని, సాగుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, చేయూతకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. తాను రైతు ప్రభుత్వాన్ని కోరుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో పసుల రంగారెడ్డి, ఎడ్మ వెంకట్రెడ్డి, మనోహర్రెడ్డి, జనార్దన్రెడ్డి, కిషోర్రెడ్డి ఉన్నారు.
కల్వకుర్తి రూరల్, నవంబర్8: బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధిసాధ్యమని రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆయా పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కల్వకుర్తి మండలవైస్ ఎంపీపీ గోవర్ధన్ అన్నారు. బుధవారం కల్వకుర్తి మండలం వేపూర్ గ్రామానికి చెందిన ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బన్నె శ్రీను, బీముడు ఉన్నారు.