రంగారెడ్డి, జూలై 14, (నమస్తే తెలంగాణ): జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. వర్షాల కారణంగా జిల్లాలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
4 ఇండ్లు నేలమట్టం కాగా, 39 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ఆరు పశువులు మృతి చెందినట్లు తెలిపారు.