పేదల కడుపు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
ప్రభుత్వం ఏటా రూ.2,700 కోట్లు ఖర్చు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
లబ్ధిదారులకు కార్డుల పంపిణీ
పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి
షాబాద్, జూలై 29: రాష్ట్రంలో పేదలంరి కడుపునింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నూతన రేషన్కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పోతార్ల బాబయ్య ఫంక్షన్ హాల్, కందుకూరు మండలంలోని సామ నర్సింహారెడ్డి గార్డెన్లో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార భద్రతా కార్డులు పేదలకు వరంగా మారాయన్నారు. రాష్ట్రంలో 3.09 లక్షల మందికి నూతనంగా రేషన్కార్డులు పంపిణీ చేశారని, దీంతో 8 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. జిల్లాలో 47 వేల నూతన రేషన్కార్డులు మంజూరయ్యాయన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 7వేలకు పైగా రేషన్కార్డులు మంజూరు చేయించినట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్కార్డు వచ్చేలా కృషి చేస్తామన్నారు.
ఇప్పటివరకు 4లక్షల మందికి కార్డులు అందించిన్నట్లు తెలిపారు. తాజాగా ఇస్తున్న 3.09 లక్షల కార్డులతో మొత్తం రాష్ట్రంలో కార్డుదారుల సంఖ్య 90 లక్షలకు చేరిందన్నారు. వీటి ద్వారా 2.80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం ఏటా రూ.2,700 కోట్లు ఆహార భద్రత కోసం ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పేదలందరి కడుపునింపడమే లక్ష్యంగా ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు మండలాల్లో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో రేషన్ కోసం ప్రభుత్వం ఏటా రూ.2700 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు.