న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటోకు గట్టి షాక్ తగిలింది. జూలై 2017 నుంచి మార్చి 2021 మధ్యకాలంలో ఎగుమతుల సేవలపై జీఎస్టీ ఎగవేసినందుకుగాను సంస్థకు రూ.11.82 కోట్ల పన్ను డిమాండ్, జరిమానా నోటీసు జారీ అయింది.
సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్ అడిషనల్ కమిషనర్ రూ. 5,90,94,889 జీఎస్టీ డిమాండ్ నోటీసు జారీ చేయగా, జరిమానాపై పెనాల్టీ రూపంలో మరో రూ.5,90,94,889 విధించారు.