హైదరాబాద్, ఏప్రిల్ 20: జెర్సీ బ్రాండ్తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న క్రీమ్లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన వ్యాపార శైలిని మార్చుకుంటున్నది. దేశవ్యాప్తంగా చిన్న ప్యాకెట్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి చిన్న సైజులో తమ ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు కంపెనీ సీఈవో భూపేంద్ర సూచీ ప్రకటించారు. ప్రస్తుతం లీటర్, అర లీటర్ ప్యాకేట్లలో ఉత్పత్తులను విక్రయిస్తున్నది.
అలాగే రోజుకు దేశవ్యాప్తంగా ఉన్న 10 ప్లాంట్ల నుంచి 7 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరిస్తున్నట్లు, వీటిలో తెలంగాణ నుంచి 2 లక్షల లీటర్లు సమీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 15 రాష్ర్టాల్లో 300కి పైగా పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు, వీటిలో పాల అమ్మకాల వాటా 10 శాతంగా ఉన్నదన్నారు. భారత్లో 9 లక్షల కోట్ల స్థాయిలో ఉన్న పాల ఉత్పత్తుల మార్కెట్లో సంస్థ టర్నోవర్ రూ.1,500 కోట్లుగా ఉన్నది.