వికారాబాద్, ఏప్రిల్ 20 : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్ లొకేషన్స్, రూట్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చెక్పోస్టుల్లో తనిఖీలు మరింత పటిష్టం చేయాలన్నారు.
మద్యం, డబ్బులు, ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసేయకుండా వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. రౌడీషీటర్లను బైండోవర్ చేయాలన్నారు. ఎన్నికల బందోబస్తుకోసం జిల్లాకు వచ్చే కేంద్ర బలగాలతో సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పెండింగ్ కేసులను వెంటనే పూర్తిచేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాస్రెడ్డి, కరుణాసాగర్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.