‘రత్నం’ తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమని, అన్ని కమర్షియల్ హంగులతో మెప్పిస్తుందని చెప్పారు హీరో విశాల్. ఆయన కథానాయకుడిగా హరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సీహెచ్ సతీష్కుమార్, కే రాజ్కుమార్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో విశాల్ మాట్లాడుతూ ‘నేను సినిమాల పరంగా తొలి నుంచి ప్రయోగాలు, సాహసాలు చేస్తున్నా.
ఈ క్రమంలో ఎన్నోసార్లు గాయపడ్డాను కూడా. అయినా సరే అభిమానులను మెప్పించేందుకు మంచి కథలను ఎంచుకుంటున్నా’ అన్నారు. ‘రత్నం’ సినిమా గురించి చెబుతూ..గతంలో తాను దర్శకుడు హరితో భరణి, పూజ సినిమాలు చేశానని, అవి కమర్షియల్గా భారీ విజయాలు సాధించాయని, అదే తరహాలో ‘రత్నం’ విజయం సాధిస్తుందని విశాల్ నమ్మకం వ్యక్తం చేశారు.
“రత్నం’ నాశైలి యాక్షన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నా కెరీర్లో ఓ విభిన్నమైన చిత్రంగా నిలిచిపోతుంది’ అన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని, రెండు తెలుగు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామని డిస్ట్రిబ్యూటర్ సతీష్ కుమార్ తెలిపారు.