షాద్నగర్, సెప్టెంబర్ 26: సరదాగా ఈత కొట్టేందుకు లోతు తెలియని నీటి గుంతలోకి దిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన సోమవారం షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన భిక్షపతి, శివలీల దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ముగ్గురు కుమారులు కాగా.. చిన్న కుమారుడు అక్షిత్గౌడ్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. అదేవిధంగా నయూమ్, కతీజా దంపతుల పెద్దకుమారుడు ఫరీద్(12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతుండగా.. సలీం, ఫిరదోస్ దం పతుల కుమారుడు సయూఫ్(7).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు.
సోమవారం దసరా సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు అక్షిత్గౌడ్, ఫరీద్, సయూఫ్లు మరో మిత్రుడు సంజీవ్కుమార్తో కలిసి గ్రామ సమీపంలోని వెంచర్లో ఉన్న నీటి గుంత వద్దకు వెళ్లారు. ఆ గుంతలోని లోతును అంచనా వేయకుండానే అక్షిత్, ఫరీద్, సయూఫ్లు నీటిలోకి దిగారు. సంజీవ్కుమార్ అనే బాలుడు నీటిలోకి దిగేందుకు భయపడి గట్టుపైకి వెళ్లాడు. కాగా నీటిలోకి దిగిన వారు మునిగిపోవడంతో భయపడిన సంజీవ్కుమార్ వెంటనే గ్రామానికి వెళ్లి స్థానికులకు విషయాన్ని చెప్పా డు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకు నే లోపే అక్షిత్గౌడ్, ఫరీద్, సయూఫ్ నీటిలో మునిగి మృతి చెందారు. అప్పటివరకు కండ్ల ముందే ఉన్న చిన్నారు లు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నా యి. వెంచర్లో ఉన్న గుంతను పూడ్చకపోవడంతోనే ముగ్గురు చిన్నారులు మృతి చెందారని స్థానికులు మండిపడుతున్నారు. ఘటనాస్థలాన్ని షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్, మున్సిపల్ చైర్మ న్ నరేందర్ సందర్శించి బాధిత కు టుంబాలకు న్యాయం చేస్తామన్నారు. మృతదేహాలకు షాద్నగర్ సర్కారు దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.