అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా మహిళా ఓటర్లు చైతన్యం చాటారు. గతంలో ఓటేసేందుకు అంతగా ఆసక్తిచూపని మహిళలు ప్రస్తుతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేశారు. కొన్ని గ్రామాల్లో వందకు వందశాతం మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల యంత్రాంగం ఊరూరా చేసిన అవగాహన కార్యక్రమాలు కూడా సత్ఫలితాన్నిచ్చాయనే చెప్పవచ్చు.
అంతేకాకుండా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే పరిస్థితి ఉన్నది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఎన్నికల్లో 48,656 మంది మహిళా ఓట్లు అధికంగా పోలైనట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. గత ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో పోలైన మహిళల ఓట్లు 3,20,764, కాగా ఈసారి 3,69,420 మహిళా ఓట్లు పోలయ్యాయి.
-వికారాబాద్, డిసెంబర్ 1, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని మహిళా ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో జి ల్లాలో మహిళా ఓటర్లే అధిక్యత ప్రదర్శించారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేం త వరకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూ ఉన్నప్పటికీ ఓపికతో మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే మంచి నేతను ఎన్నుకోవడంలో తామేందుకు భాగస్వాములు కావొద్దనే అభిప్రాయంతో వారు తమ ఓటు హ క్కును వినియోగించుకున్నారు.
జిల్లా ఎన్నికల యంత్రాంగం మహిళా ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు ఊరూరా చేసిన అవగాహన కార్యక్రమాలు కూడా సత్ఫలితాలనిచ్చాయి. ఈ ఎన్నికల్లో మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఓటు వేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చా రు. దేనిలోనూ మేమూ తక్కువ కాదనేలా ఏ ప్రలోభాలకు లొంగకుండా ఓపికగా క్యూలో ని ల్చుని అభివృద్ధి చేసే వారికే మా ఓటంటూ ఓటెత్తారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేలా మారిన పరిస్థితి నెలకొంది.
ఏ ఎన్నికలు జరిగినా… మహిళా ఓటర్లే కీలకంగా మారుతున్నారు. గతంలో ఓటు వేసేందుకు అం తగా ఆసక్తి చూపని మహిళలు ప్రస్తుతం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఒకప్పుడు 30 నుం చి 35 శాతానికి మించని మహిళా ఓటింగ్ శాతం ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో అయితే వందకు వం ద శాతం మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా గిరిజన తండా ల్లో అయితే మహిళా ఓటర్లలో చాలా చైతన్యం వచ్చింది. మహిళలు గుడ్డిగా ఓటేసే రోజులకు కూడా చరమగీతం పాడారు. ఇప్పుడంతా మా ఊరికేం చేశారు.. మనకేం చేశారని ఆలోచించి ఓటేసేలా మ హిళలు చైతన్యవంతులయ్యారు.
ఈ ఎన్నికల్లో జిల్లాలోని తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఆధిక్యత ప్రదర్శించారు. సంబంధిత రెండు నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓట్లే అధికంగా పోలు కావడం గమనార్హం. అయితే ఈ ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలో మొత్తం 2,59,422 ఓట్లు పో ల్ కాగా.. 98,466 మహిళా ఓట్లు, 1,00,519 పురుషుల ఓట్లు పోలయ్యాయి. వికారాబాద్ ని యోజకవర్గంలో మొత్తం 2,28,253 ఓట్లు పో లు కాగా.. 85,454 మహిళా ఓట్లు, 87,026 పురుషుల ఓట్లు పోలయ్యాయి.
తాండూరు ని యోజకవర్గంలో మొత్తం 2,36,076 ఓట్లు పోలయ్యాయి. వీరిలో 87,963 మహిళా ఓట్లు, 86,038 పురుషుల ఓట్లు పోలయ్యాయి. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 2,36,625 ఓ ట్లు పోల్ కాగా.. 97,537 మహిళలు, 96,403 పురుషుల ఓట్లు పోలయ్యాయి. తాండూరు ని యోజకవర్గంలో పురుషుల కంటే 1,925 మంది మహిళా ఓట్లు అధికంగా పోలయ్యాయి, కొడంగల్ నియోజకవర్గంలోనూ పురుషుల కంటే 1,134 మంది మహిళా ఓట్లు అధికంగా పోలయినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఎన్నికల్లో 48,656 మంది మహిళా ఓట్లు అ ధికంగా పోలైనట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. గత ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో పోలైన మహిళా ఓట్లు 3,20,764 ఓట్లు కాగా ఈసారి ఎన్నికల్లో 3,69,420 మ హిళా ఓట్లు పోలయ్యాయి. వికారాబాద్, పరి గి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం గత ఎన్నికల్లో మహిళా ఓట్లు పోలైన శాతం 49.66 శాతం కాగా, ఈసారి ఎన్నికల్లో 76.51 శాతం మహిళా ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో మహిళా ఓట్లు 26 శాతం మేర పెరగడం గమనార్హం. ప్రధానంగా ఈసారి ఎన్నిక ల్లో అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో మహిళా ఓట్లు పోలయ్యాయి.