నిజామాబాద్ లీగల్, ఏప్రిల్ 24: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుతేజం నూతనలపాటి వెంకటరమణకు నిజామాబాద్ న్యాయ వ్యవస్థతో ప్రత్యేక అనుబంధమున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో నిజామాబాద్ పోర్ట్ఫోలియో జడ్జిగా జిల్లా కోర్టుకు రావడం, సంబంధి త న్యాయాధికారులతో సివిల్, క్రిమినల్ కేసుల వివరా లు తెలుసుకొని పెండెన్సీని తగ్గించడానికి తగిన సూచన లు, సలహాలు, ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ రమణ చొ రవతో చాలా కేసులను పరిష్కరించడానికి అవకాశం ఏ ర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా న్యాయవాదులతో ప్రత్యే క అనుబంధాన్ని ఏర్పర్చుకున్నారు.
సివిల్, క్రిమినల్ కేసుల సత్వర న్యాయ విచారణకు వీలుగా ఫాస్ట్ట్రాక్ కోర్టుల భవన సముదాయాన్ని హైకోర్టు జడ్జి హోదాలో 12 డిసెంబర్ 2001న శంకుస్థాపన చేసి త్వరగా భవనం నిర్మించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. న్యాయసేవలు విస్తృతం చేయాలని, సామాన్యుడికి న్యాయం అందజేయడంలో ఆలస్యం కాకూడదనే లక్ష్యంతో తాను జిల్లా పోర్ట్ఫోలియో జడ్జిగా ఉన్న సమయంలోనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం న్యాయ సేవాసదన్ను పూర్తి చేయించి నాటి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోతీలాల్ బి.నాయక్తో కలిసి 27 జనవరి 2002న ప్రారంభించారు. నాటికి సొంత కార్యాలయం లేని న్యాయ సేవా సంస్థ సొంత కార్యాలయంలో విశాలమైన సమావేశపు హాల్లో తన న్యాయ సేవలను విస్తృతం చేయడానికి అవకాశం ఏర్పడింది.
నిజాం హయాంలో నిర్మించిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు భవనం పాతబడింది. దీంతో దాని స్థానంలో నూతన కోర్టు సముదాయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనలు, నిధులు దీర్ఘకాలం పెండింగ్లో ఉండడంతో అప్పటి నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్శర్మ నాయకత్వంలోని ప్రతినిధి బృందం జస్టిస్ రమణను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించి ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిజామాబాద్ నూతన జిల్లా కోర్టు సముదాయానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు, కేంద్ర ప్రభుత్వం మూడున్నర కోట్లు మొత్తం నాలుగున్నర కోట్ల నిధులు తొలి విడుతగా మంజూరు చేయించి 15 ఫిబ్రవరి, 2003న భవన సముదాయానికి ఏర్పాట్లు చేయడంలో కీలక భూమిక నిర్వహించారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే 2019లో జిల్లా కేంద్రానికి చేరుకొని న్యాయవాదులతో జిల్లా న్యాయ వ్యవస్థ పని తీరును తెలుసుకొన్నారు. ఇంకా తన సేవలు అవసరమైతే సహకరిస్తానని తెలియజేసి అనంతరం బాసర వెళ్లి శ్రీ సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు.