మాడ్గుల, డిసెంబర్ 9 : రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్త బ్రాహ్మణపల్లికి చెందిన కాంగ్రెస్ నుంచి 20 మంది నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్శితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. ఇల్లు లేని పేదలకు రూ.3 లక్షలు అందజేస్తామన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, నాయకులు ఆరోగ్యరెడ్డి, అంతయ్య, అమీనా, జాని, బాలు, జంగయ్య, పాల్గొన్నారు.