బొంరాస్పేట, జనవరి 18 : మండలంలో వ్యవసాయ చెరువులు, కుంటలు, బోర్ల కింద యాసంగి వరినాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. గత ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షా లతో మండలంలో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి. వ్యవసాయ బోర్లలో కూడా భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరిగాయి. దీంతో రైతులు యాసంగి సాగుపై దృష్టి సారించారు. రైతులు యాసంగిలో ప్రధానంగా చెరువులు, కుంటలు, బోర్ల కింద వరి పంటలు పండిస్తారు. మండలంలో ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులు లేకున్నా చెరువులు, వ్యవసాయ బోర్లపై ఆధారపడి వరినాట్లు వేస్తున్నారు. చెరువులు, కుంటల కింద వరితప్ప ఇతర ఏ పంటలు సాగు చేసే అవకాశం లేకపోవడంతో రైతులు వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు వర్షాలతో బోర్లలో భూగర్భ జలాలు పెరగడం, దీనికి తోడు ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తుం డటం, రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తుండడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కల్పిస్తుండడంతో రైతులు వరిసాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బొంరాస్పేట, దుద్యాల మండలాల్లోని 12 నోటిఫైడ్ చెరువులు, కుం టలు, వ్యవసాయ బోర్ల కింద ఈ ఏడాది సుమారు 16 వేల ఎకరాలలో వరి నాట్లు వేసే అవకాశం ఉంది. మండలంలోని పలు గ్రామాల్లో వరినాట్లు వేసే పనులు ప్రస్తుతం జోరు గా సాగుతున్నాయి. దీంతో మహిళలు, పురుషులకు ఉపాధి దొరుకుతున్నది.
పుష్కలంగా ఎరువులు, విత్తనాలు
రైతన్నలకు ప్రభుత్వం ఎరువులు, విత్తనాలను ఏటా సకాలంలో అందుబాటులో ఉం చు తుంది. గత కొన్నాళ్ల నుంచి యాసంగి సీజన్కు ముందే ప్రభుత్వం రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. దీనివల్ల రైతులు ముందే విత్తనాలు, మందులను కొనుగోలు చేసి సిద్ధం చేసుకుని సాగు పనులను ప్రారంభించారు. ఇదిలా ఉండగా వరిసాగులో ఎక్కువ దిగుబడుల కోసం రైతులు కొత్త కొత్త పద్ధతులను అవలంభి స్తు న్నారు. సంకరజాతి విత్తనాలతో, కొత్త రకం విత్తనాలను ఎంపిక చేసుకుని నాట్లు వేస్తు న్నారు. పొలంలో పంటలకు భూసారం పెరిగేందుకు కొన్నేళ్ల నుంచి నిల్వ చేసుకున్న పశు వుల పేడను, పొలం గట్లపై పెరిగిన కానుగ చెట్ల కొమ్మలను నరికి కరిగెటలో తొక్కుతు న్నారు. దీనివల్ల దిగుబడులు ఎక్కువగా వస్తాయని రైతుల అభిప్రాయం.