మంచాల, డిసెంబర్ 26 : డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని, నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్బాబు పేర్కొన్నారు. మంగళవారం మంచాల మండలంలోని 15 గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 136 సీసీ కెమెరాలను కమిషనర్ ప్రారంభించి మాట్లాడారు. యువత డ్రగ్స్ వ్యసనాలకు బానిస కాకూడదని, డ్రగ్స్ సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా ప్రతిఒక్కరూ బాధ్యతతో పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి, ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీసీ కెమెరాలతో కేసులు త్వరగా పరిష్కారమయ్యేందుకు అవకాశముందన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థతో ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. ముందుగా సీపీకి పోలీసులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాస్రావు, ట్రాఫిక్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు, సీఐలు కాశీవిశ్వనాథ్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.