సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) ;పేదలకు ఎన్నో ఏండ్ల కల సాకరమైన వేళ.. ఆత్మగౌరవ సౌధం అందివచ్చిన వేళ ఇంటింటా పండుగ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. గ్రేటర్ పరిధిలో తొలి దశలో 11700 ఫ్లాట్లను లబ్ధిదారులకు అందజేశారు. రూపాయి ఖర్చు లేకుండా, పారదర్శకంగా అర్హులైన పేదలకు మంత్రులు ఇండ్ల పట్టాలు అందజేశారు. తొమ్మిది ప్రాంతాల్లో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్అలీ, మహేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకల వసతులు కల్పించి దేశంలో అతిపెద్ద డిగ్నిటీ కాలనీని నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ సొంతమని అన్నారు. కొల్లూరులో మంత్రి హరీశ్రావు, కుత్బుల్లాపూర్లోని బహదూర్పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పటాన్చెరు సమీపంలోని కర్ధనూర్లో మంత్రి మహేందర్ రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని అహ్మద్నగర్లో మంత్రి మల్లారెడ్డి డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. బహదూర్పుర, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో డబుల్బెడ్రూం ఇండ్లను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ లబ్ధిదారులకు అందజేశారు. మేడ్చల్లోని ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, కాప్రా డివిజన్లోని శ్రీరాంనగర్లో నగర మేయర్ విజయలక్ష్మి డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు.
పేదల కండ్లలో ఆనందం వెల్లివిరిసింది.. సొంతింటి కల సాకారమైంది. శనివారం నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి.9 ప్రాంతాల్లో తొలి దశలో 11700 గృహాలను లబ్ధిదారులకు కేటాయించారు. కొల్లూరులో మంత్రి హరీశ్రావు, బహదూర్పల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, మంకాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కర్ధనూర్లో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, అహ్మద్నగర్లో మంత్రి మల్లారెడ్డి , బహదూర్పుర, చాంద్రాయాణగుట్ట నియోజకవర్గాల్లో మంత్రి మహమూద్ అలీ, ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, శ్రీరాంనగర్లో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం అదృష్టం ;కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఆహ్మద్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ముషీరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు చెందిన 15 వందల మంది లబ్ధిదారులకు అందజేశారు. దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడ లేదని, పేదలకు ఒక్క పైసా భారం పడకుండా అన్ని వసతులతో డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రతి కార్యక్రమం ఎంతో గొప్పది. ఇక్కడ చేపడుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయాలు, పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టడం ఎంతో గొప్ప విషయం’ అని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, జవహర్నగర్ మేయర్ కావ్య, మున్సిపల్ చైర్పర్సన్ ప్రణిత తదితరులు పాల్గొన్నారు.
డబుల్ ఇండ్ల పథకం దేశానికే ఆదర్శం ;రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్లో మహేశ్వరం, మలక్పేట, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన 2,230 లబ్ధిదారులకు ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, బొగ్గారపు దయానంద్, మల్లేశం, మలక్పేట ఎమ్మెల్యే బలాల, జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూం ఇండ్లు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతాపసింగారంలో 28 ఎకరాల్లో 2000 పైగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి ప్రారంభించారు. ర్యాండమైజేషన్ లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. అంబర్పేట నియోజకవర్గానికి 500, ఎల్బీనగర్ నియోజక వర్గానికి 500 చొప్పున మొత్తం వెయ్యి ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు. డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తామంటూ తిరిగే మధ్య దళారులను ఎవరూ నమ్మవద్దని, ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరిగినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు చెప్పారు.
మరోసారి ఆశీర్వదించాలి ;మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఉప్పల్, సెప్టెంబర్ 2 : సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కాప్రా డివిజన్లోని శ్రీరాంనగర్లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గల్లో ప్రతి నియోజకవర్గంలో 500 ఇండ్లు కేటాయించినట్లు మేయర్ చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
పాతనగరం అభివృద్ధి కోసం ;హర్నిషలు కృషి ; హోం మంత్రి మహమూద్ అలీ
చాంద్రాయణగుట్ట / చార్మినార్, సెప్టెంబర్ 2 : పాతనగరం అభివృద్ధి కోసం తొమ్మిదేండ్లుగా అహర్నిషలు కృషిచేస్తూ అనుకున్న లక్ష్య సాధనలో ముందుకెళ్తున్నామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. శనివారం బహదూర్పుర, చంద్రాయాణగుట్ట నియోజకవర్గాల్లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను ఆయన ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీతో కలిసి లబ్ధిదారులకు అందించారు.