111జీవో ఎత్తివేతతో 84 గ్రామాల ప్రజల దశాబ్దాల కల సాకారమైన వేళ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం జీవో పరిధిలోని గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, జనం పటాకులు కాల్చి, స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మొయినాబాద్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ జీవో ఎత్తివేతతో 84 గ్రామాల్లో ప్రగతి పరుగులు పెట్టనున్నదని, ఈ ప్రాంతమంతా మరో మినీ హైదరాబాద్గా కానున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం 111 జీవో రద్దు చేసిందన్నారు. దీంతో 84 గ్రామాలకు మహర్దశ రానున్నదన్నారు. చేవెళ్ల ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మొయినాబాద్, మే 19 : జంట నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు నాడు తీసుకొచ్చిన 111జీవోను రాష్ట్ర కేబినెట్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆ జీవో క్రింద ఉన్న 84 గ్రా మాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ దశాబ్దాల కల సాకారమైందని సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సం దర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని శుక్రవారం పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. జీవో ఎత్తి వేయడంతో 84 గ్రామాల పరిధిలోని ప్రాం తాలు మరో మినీ హైదరాబాద్గా అభివృద్ధి చెందుతాయని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు.
111 జీవోను ఎత్తివేస్తేనే తాను బీఆర్ఎస్లో చేరుతానని.. పార్టీలో చేరిన సందర్భం గా సీఎం కేసీఆర్తో హామీ తీసుకున్నట్లు ఆయ న గుర్తు చేశారు. జీవోను ఎత్తివేయడంతో 84 గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. జంట జలాశయాలను పరిరక్షించేందుకు ప్రభు త్వం మాస్టర్ ప్లాన్ను రూపొందించి అభివృద్ధి పనులను చేపడుతుందన్నారు. కాగా 111 జీవో ను ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ గురువారం నిర్ణయం తీసుకోవడంపై శుక్రవారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు. మండల కేంద్రంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీ, ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు.
బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఎంపీ రంజిత్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 111 జీవో 84 గ్రామాల ప్రజలకు గుదిబండగా ..అభివృద్ధికి అడ్డుగా మారిందన్నారు. ప్రజల ఇబ్బందులను స్వయంగా పరిశీలించి చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి పలు సార్లు ఈ సమస్యను తీసుకెళ్లినట్లు వివరించారు. కాగా ఎన్నికల సమయంలో చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని.. దానికి కట్టుబడి గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మాట తప్పని, మడమ తిప్పని గొప్ప నేత అంటూ కొనియాడారు.
ఇక నుంచి అక్కడ కూడా హెచ్ఎండీఏ విధివిధానాలే వర్తిస్తాయన్నారు. ఈసీ, మూసీ నదులను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. జీవో రద్దుతో 84 గ్రామాల్లో రియల్ బూమ్తో గ్రామాలు ప్రగతిపథంలో ముందుకు సాగుతాయన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో చేవెళ్ల ప్రాంతాన్ని మినీ హైదరాబాద్గా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ను కూడా రూపొందించారన్నారు. 111 జీవోను ప్రభు త్వం ఎత్తివేయడంతో ప్రతిపక్ష పార్టీల నాయకు లు కూడా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. జీవో ఎత్తివేయడంతో 84 గ్రామాల ప్రజల దశాబ్దాల కల సాకారమైందని .. చేవెళ్ల ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు, రాష్ట్ర కేబినెట్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్, శ్రీహరియాదవ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రావూఫ్, మా జీ వైస్ చైర్మన్ రాజు, డైరెక్టర్లు మహేశ్యాదవ్, రాజూగౌడ్, భిక్షపతిగౌడ్, రాము, సర్పంచ్లు మనోజ్కుమార్, శ్రీనివాస్, మహేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివా స్, ఎంపీటీసీలు అర్జున్, రితీశ్రెడ్డి, పరమేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రమేశ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజ్జు, బీసీ సెల్ మం డలాధ్యక్షుడు ఆం జనేయులుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు షేక్ మహబూబ్, వెంకట్రెడ్డి, సుధాకర్యాదవ్, రవీందర్రెడ్డి, రవీయాదవ్, నర్సింహులు, ఈశ్వర్, రాజు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ప్రజల ప్రయోజనాల కోసమే పార్టీ మారాను.. అప్పుడు పలువురు పలు రకాలుగా మాట్లాడారు. పార్టీలో చేరినప్పుడే 111 జీవోను ఎత్తివేస్తానంటేనే బీఆర్ఎస్లో చేరుతానని సీఎం కేసీఆర్ నుంచి హామీ తీసుకున్నా. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు ఇచ్చిన హామీ ప్రకారం జీవోను ఎత్తివేసి 84 గ్రామాల ప్రజల దశాబ్దాల కలను సాకారం చేశారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 111 జీవోతో దాని క్రింద ఉన్న గ్రా మాల్లోని ప్రజలకు గుదిబండగా మారిందని.. అక్కడి గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
జంట నగరాలకు గతంలో తాగునీటిని అందించిన హిమాయత్సాగర్, గండిపేట జంట జలాశయాల పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుం డా వాటిని పరిరక్షిస్తూ ప్రభుత్వం విధివిధానాలను రూపొందించి జీవోను ఎత్తివేయడం జరిగిందన్నారు. గోదావరి జలాలతో రెండు జలాశయాలను నింపాలని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కేసీఆర్ మాట ఇస్తే కచ్చితంగా అమలు చేసి చేస్తారన్నారు. రానున్న రోజుల్లో ఈ 84 గ్రామాల్లో అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్పుడు కూడా పొందలేని సంతోషాన్ని ప్రస్తుతం పొందినట్లు తెలిపారు. 111 జీవో ఎత్తివేయడం తో చేవెళ్ల ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ఆయ న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు