రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్నది.. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తుండడంతో యావత్తు దేశమంతా మన వైపు చూస్తున్నది..’ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలో రూ.160.33 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ షాద్నగర్ పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. రాష్ట్రం రాక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి.. రాష్ట్రం వచ్చాక ఎంతలా ప్రగతి సాధించామో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే మనల్ని నట్టేట ముంచుతారని పేర్కొన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ర్టానికి ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ఎమ్మెల్సీ వాణీదేవి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నదన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని, దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ఎంపీ శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మె ల్యే అంజయ్య యాదవ్తో కలిసి షాద్నగర్ పట్టణంలోని శాఖ గ్రంథాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నైట్షెల్టర్, రోడ్ల డివైడర్ల సుందరీకరణ పనులతోపాటు పలు అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడు తూ.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమా ల అమలు విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. దేశంలోని ప్రజలందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని ఇం దుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలే కారణమ ని కొనియాడారు. నేడు షాద్నగర్ పట్టణంలో రూ.160.33 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారం భోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నట్లు తెలిపారు. ఇదంతా కేవలం పని చేయగల నాయకుడైన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తోనే సాధ్యమైనదన్నారు. సత్తా ఉన్న నాయకుడు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్ నియోజకవర్గానికి దొరకడం ప్రజలు చేసుకున్న అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని.. తెలంగాణ రాక ముందు.. వచ్చిన తర్వాత జరిగిన ప్రగతిని ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తాగు, సాగునీటికి, విద్యుత్తుకు మనం ఎంతో గోసపడ్డామని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్, బీజేపీలతోనే రాష్ట్రం దివాలా..
కాంగ్రెస్, బీజేపీలతోనే రాష్ట్రం దివాలా తీసిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. నాడు ప్ర త్యేక రాష్ర్టాన్ని వ్యతిరేకించిన నాయకులు.. నేడు తమ పార్టీని గెలిపిస్తే ఉద్యోగాలిస్తాం, ప్రజలకు మంచి చేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీల ఉద్యోగాలు ఊడగొట్టి వారిని రోడ్లపైకి తీసుకొచ్చాయన్నారు. కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వ తీరుతో క్రీడాకారులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి దాపురించిందన్నా రు. కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నదని, ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను అందించి ఆదుకుంటున్నదన్నారు. సంక్షేమ పాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న పింఛన్లు, దళితబంధు, రైతుబంధులాంటి ఇతర సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోతాయని.. తెలంగాణ కుక్కలు చింపిన విస్తరిలా మారి భవిష్యత్తు అంధకారం గా మారుతుందన్నారు. అందువల్ల ప్రజలు ఆలోచించి ప్రజా క్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ను ఆదరించి.. కేసీఆర్ను సీఎం గా భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
అగ్రపథంలో రాష్ట్రం..
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతోనే రాష్ట్రం అగ్రపథంలో ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. నాడు ఉద్యమం సమయంలో తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని, అం తా అంధకారంగా మారుతుందని కొందరు ప్ర జలను భయభ్రాంతులను చేశారు. కానీ ప్రస్తు తం దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారింది. ఇతర దేశాల కంపెనీలు కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయ న్నారు. ఈ రోజు ఎకరం భూమి కోట్ల రూపాయలను పలు కుతున్నదని.. గ్రామాలు, పట్టణాలతో దీటు గా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తెలి పారు. అన్ని గ్రామాల్లోనూ బడులు, గుడు లు, దవాఖానలను నిర్మించుకున్నట్లు పేర్కొ న్నారు. సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణే లేదని పేర్కొన్నారు. లేనిపోని మాటలు చెప్పే ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మొద్దని ఆయన ప్రజలకు సూచించారు.
తెలంగాణ ఏర్పాటుతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి
తెలంగాణ ఏర్పాటుతోనే అన్ని ప్రాంతాల అభి వృద్ధి జరిగిందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధే ధ్యేయం గా ముందుకు సాగుతున్నాయి. అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇంటింటికీ పథకాలను అందించి ఆదుకుంటున్నారు. ప్రభుత్వ పథకం పొందని ఇల్లూ అంటూ రాష్ట్రంలోనే లేదు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి దేశంలోని ప్రజలందరూ ఆకర్షితులవుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముం దుకెళ్తున్నది.
– అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే
బంగారు తెలంగాణ దిశగా అడుగులు
బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యాస, భాషలపైనా దుష్ప్రచారం జరిగింది. కానీ నేడు తెలంగాణ యాసలో సినిమాలు, సీరియల్స్ కూడా వస్తున్నాయి. సమస్యకు పరిష్కారం చూపే వరకు వదలని విక్రమార్కుడు మన అంజయ్యయాదవ్.. ఆయన ఈ నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్నంత కాలం ఏ సమస్యా రాదు.
–సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ
లక్షలాది మందికి ఉద్యోగాలు
తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అన్నట్లుగా నేడు రాష్ట్ర చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మహబూబ్నగర్ ఎంపీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ర్టాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నది. దేశానికే మన సంపదను అందిస్తున్నాం. రాష్ట్రం ఆర్జిస్తున్న సంపదను సీఎం కేసీఆర్ పలు పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదులు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎన్నో మోసపూరితమాటలు చెప్పారు. కానీ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే నడిచారు. ఈ తొమ్మిదేండ్లలో పారిశ్రామి క అభివృద్ధికి ఎన్నో బాటలు పడ్డాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయి. మరికొన్ని పరిశ్రమలు త్వరలోనే రాష్ర్టానికి రానున్నాయి.
-శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ