శంకర్పల్లి, జూలై 27 : మున్సిపాలిటీలోని బుల్కాపురంలో మంగళవారం ప్రజలు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహిళలు బుల్కాపురం శివారులో కాళికామాతకు నైవేద్యాన్ని సమర్పించారు. కౌన్సిలర్లు లక్ష్మమ్మరాంరెడ్డి, శ్వేతపాండురంగారెడ్డి బోనాలతో కాళికామాత ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా కాళికామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోపాల్, శంకర్పల్లి మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్కుమార్, కౌన్సిలర్లు గోపాల్, అశోక్, నాయకులు రాంరెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా ఎల్లమ్మ బోనాలు
మండలంలోని కుమ్మరిగూడ లో ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి భక్తులు గ్రామ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలు బోనాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో సర్పంచ్ కేతనరమేశ్యాదవ్, ఎంపీటీసీ అరుణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్ పాల్గొని పూజలు చేశారు.