MP Arvind | కోరుట్ల రూరల్/సారంగాపూర్, మే 2 : ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డికి శిక్ష తప్పదని, జూలైలో జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్, రాత్రి సారంగాపూర్ మండలం పెంబట్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు.
జూలై 14న సీఎం రేవంత్రెడ్డి జైలుకు పోవడం పక్కా అని, ఆ తేదీ ఎప్పుడు వస్తుం ది? జైలుకు ఎప్పుడు వెళ్తాడా? అని మంత్రు లు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. రేవంత్ జైలుకెళ్లడం ఖాయమని తెలిసే కాంగ్రెస్లోని ముఖ్యనాయకులు సంబురాలు చేసుకుంటున్నారని తెలిపారు.
‘కాంగ్రెస్ హామీ ఇచ్చినవి ఆరు గ్యారంటీలు కాదు.. అవి ఆరు గాడిద గుడ్లు. గాడిద గుడ్లు మోసినోన్ని ఏమనాలి? నువ్వు ముఖ్యమంత్రివా? గుడ్లు మోస్తున్నవ్.. గాడిద గుడ్డు పెడుతదా?.. గాడిద గుడ్డు ఎన్నడూ పెట్టది.. ఈయన ఎన్నడూ గ్యారెంటీలు ఇవ్వడు. పచ్చి మోసం చేస్తున్నడు’ అని మండిపడ్డారు. రేవంత్తులం బంగారం, నాలుగు వేల పింఛన్, మహిళలకు రూ.2,500, ధాన్యానికి రూ.500 బోనస్, రైతుబంధు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణం మాఫీ, నిరుద్యోగ భృతి అని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు.
ఇవన్నీ ప్రశ్నలు ఎదురవుతాయని బీజేపీ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేస్తదని కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. రాష్ర్టాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించడం అవివేకమ ని విమర్శించారు. కామన్ సివి ల్ కోడ్ అమలైతే దేశ ప్రజలు సురక్షితంగా ఉంటారని, దానిపై కాంగ్రెస్ నాయకులు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. మోదీ బతికున్నంత వరకు బీసీ,ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించడం గానీ, రద్దు చేయడం గానీ జరగదని తెలిపారు.
మతతత్వ రిజర్వేషన్లు ఉండవని, ఆర్థికంగా వెనుకబడిన అన్ని కుల, మతాలకు చెందిన వారి కోసం రిజర్వేషన్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే ముస్లిం రాజ్యం అయిపోయి, దేశం మూడు ముక్కలవుతుందని చెప్పారు. అధికారం ఉంది కదా? అని తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.