ముస్తాబాద్ : రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్పై టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నిరాధార ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరని టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు భూంపెల్లి సురేందర్రావు, ముస్తాబాద్ పట్టణాధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు.
ఇటీవల మంత్రి కేటీఆర్పై రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలను వారు ఖండించారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రభాగంలో నిలిపేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూస్తున్నారని, అదే స్థాయిలో మంత్రి కేటీఆర్ కూడా తండ్రికి తగ్గ తనయుడిలా దేశ, విదేశాల్లోని వివిధ పరిశ్రమల అధినేతలతో నిరంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. మంత్రి కేటీఆర్కు రోజురోజుకూ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే రేవంత్రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మండల యువత అధ్యక్షుడు శీలంస్వామి, మండల విద్యార్థి సంఘం అధ్యక్షుడు నవాజ్, మాజీ పట్టణాధ్యక్షుడు గూడూరి భరత్, ముక్క మల్లయ్య, మెంగని మనోహర్, ఏఎంసీ డైరెక్టర్ దేవేందర్, అన్వర్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.