నవీపేట, ఏప్రిల్ 26 : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కోట్ల రూపాయలతో ఇరిగేషన్ కాలువల నిర్మాణ పనులను చేపట్టిందని, పనుల్లో నాణ్యత లోపించిందని, తక్షణమే విచారణ చేపట్టాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు. నవీపేట మండల సర్వసభ్య సమావేశాన్ని కొవిడ్ నిబంధనల మేరకు ఎంపీపీ సంగెం శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఎంపీడీవో సయ్యద్ సాజి ద్అలీ, వైస్ ఎంపీపీ హరీశ్ హాజరయ్యారు. మండ లంలోని వివిధ గ్రామాల్లో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇరిగేషన్ పనుల్లో సంబంధిత కాంట్రాక్టర్తో ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై నాసిరకం పనులు చేపట్టారని సభ్యులు సతీశ్, బేగరి జనార్దన్, మీనా, వైస్ ఎంపీపీ హరీశ్ ఇరిగేషన్ ఏఈ భూజేంధర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే నాసిరకం పనులపై విచారణ చేపట్టి సొమ్మును రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ బల్రామ్తో సభ్యులు ఫోన్లో మాట్లాడారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నవీపేట పీహెచ్సీలో కేవలం వంద టెస్టులు మాత్రమే చేస్తున్నారని, టెస్టుల సంఖ్యను పెంచాలని డాక్టర్ తరణ్నాజ్కు పలువురు సభ్యులు సూచిస్తూ తీర్మానం చేశారు. ఉపాధి హామీ పనులను 15 రోజుల పాటు వాయిదా వేయాలని మహాంతం సర్పంచ్ మేకల రాజేశ్వర్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోద ముద్ర వేసింది. అంగన్వాడీ పోస్టులను పెంచాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా సభ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఎంపీపీ సంగెం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు.