గోదావరిఖని: జయదుర్గాదేవి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం గోదావరిఖని నగరంలోని జయదుర్గాదేవి ఆలయంలో రెండోరోజు నవ చండీయాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మేయర్ డా.అనిల్కుమార్, ఎంపీపీ రాంరెడ్డి, జడ్పీటీసీ ఆముల నారాయణ, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్లు పెంట రాజేశ్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, వేగోళపు శ్రీనివాస్, నీల గణేశ్, చెల్కలపల్లి శ్రీనివాస్, మారుతి, అచ్చ వేణు, అడప శ్రీనివాస్ ఉన్నారు.