గోదావరిఖని, జూలై 30: ఆర్జీ-1 మేడిపల్లి ఓసీపీని డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ ైక్లెమెట్ ఛేంజ్ ఆరోఖ్య లెనిన్ శుక్రవారం సందర్శించారు. క్లస్టర్ ఆఫ్ మైన్స్ అయిన జీడీకే-1,3, 2, 2ఏ, 5, మేడిపల్లి ఓసీపీల తనిఖీ కోసం సందర్శించినట్లు తెలిపారు. ఓసీపీ పరిసరాల్లో డంప్ యార్డులపై పెంచిన చెట్లు, సెటిలింగ్ పాండ్లు, ఓసీపీ చుట్టూ పచ్చదనం, వ్యర్థ జలాల శుద్ధి చేసే విధానం, కంటిన్యూయస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ను పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి మట్టి డంప్లపై చెట్లను నాటిన విధానాన్ని తనిఖీ చేశారు. క్వారీలో దుమ్మూ, ధూళి లేవకుండా తీసుకున్న చర్యలను తనిఖీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జీఎం నారాయణ, ఎన్విరాన్మెంట్ జీఎం రవి ప్రసాద్, మేడిపల్లి పీవో సత్యనారాయణ, అధికారులు ప్రహ్లాద్, రవికిరణ్, గోవిందరావు, ఆంజనేయ ప్రసాద్, అభిలాశ్, వీరారెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
యైటింక్లయిన్ కాలనీ, జూలై 30 : ఆరోఖ్య లెనిన్ పర్యటించారు. ఇందులో భాగంగా ఆర్జీ-2 ఏరియాలోని వకీల్పల్లి గని, ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1లో పర్యటించి పర్యావరణ అనుమతులు, పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గనులపై మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో ఆర్జీ-2, 3 జీఎంలు టీ వెంకటేశ్వర్రావు, మనోహర్, కార్పొరేట్ పర్యావరణ జీఎం రవిపస్రాద్, ఎస్వోటూ జీఎం సాంబయ్య, ఓసీపీ-1 పీవో రాధాకృష్ణ, వీకేపీ గ్రూప్ ఏజెంట్ శ్రీనివాస్ రెడ్డి, సేఫ్టీ అధికారులు పూర్ణచందర్, పర్యావరణ అధికారి రాజారెడ్డి, ఫారెస్ట్ మేనేజర్, డేవిడ్ అభిలాశ్, ఎన్వీఆర్ ప్రహ్లాద్, మేనేజర్స్ రవికిరణ్, ఉదయ్ హరిజన్ తదితరులు పాల్గొన్నారు.