సంగారెడ్డి, మే 4: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఆర్టీసీకి నిధులు కేటాయించింది. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ధీర్ఘకాలికంగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు వందల కోట్ల నిధు లు విడుదల చేసి ఆదుకునే ప్రయత్నం చేసినా మెరు గుపడని పరిస్థితి. కార్గో సేవలు మాత్రం ఆర్టీసీకి లాభాలు చేకూరు స్తున్నాయి. ఆర్టీసీ కొత్తగా డ్రైవింగ్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు బస్సు డిపోల్లో త్వరలో శిక్షణను ప్రారంభించనున్నది. డ్రైవింగ్ శిక్షణకు ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి డిపోతోపాటు మెదక్ డిపో, సిద్దిపేట డిపోల్లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్తో సమన్వయం చేసుకుని అర్హులను ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో ఆర్టీసీలో లైట్ మోటర్ వాహనాల(కార్లు) డ్రైవింగ్ను అందుబాటులోకి తీసుకురావడానికి చర్య లు తీసుకుంటునట్లు అధికారులు చెబుతున్నారు.
నోటిఫికేషన్తో అభ్యర్థుల ఎంపిక..
డ్రైవింగ్ శిక్షణకు 25 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా, అందులో కేవలం ఐదుగురు అభ్యర్థులుగా ఎంపికయ్యారు. అలాగే, మరో ఆరుగురు ఏడాది లైసెన్సు పూర్తికాకపోవడంతో సంబంధిత రవాణాశాఖ అధికారులకు సడలింపుకోసం నివేదికలు పంపించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రవాణాశాఖ అధికారుల నుంచి ఆదేశాలు రాగానే మొత్తం 11 మంది అభ్యర్థులతో శిక్షణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. శిక్షణకు దరఖాస్తు చేసుకుని ఎంపికైన అభ్యర్థులు ఫీజు రూపంలో ఒక్కొక్కరు రూ.15,600 చెల్లించాలి. దీంతో ఆర్టీసీకి అదనంగా ఆదాయం సమకూరడంతో పాటు డ్రైవింగ్ శిక్షణకు ఆర్టీసీ కేంద్రంగా మారనున్నది. ఆర్టీసీ అధికారులు ప్రతి 15మందితో ఒక బ్యాచ్ ఏర్పాటు చేసి రోజు డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. అనుకున్న విధంగా అభ్యర్థుల రాకపోవడంతో రవాణాశాఖ డిప్యూ టీ కమిషనర్ ఆదేశాల మేరకు 6 మందికి అనుమతులు ఇస్తే 11 మందితో శిక్షణా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆర్టీసీ అధికారులు ధ్రువపత్రాలు అందజేయనున్నారు. అనంతరం ఆర్టీవో అధికారులు బ్యాచ్ నంబర్, హెవీ లైసెన్స్ల కోసం రూ. 2వేల ఫీజులను చెల్లిస్తే వెంటనే జారీ చేయనున్నారు.
30 రోజులు శిక్షణ…
ఒక్కో అభ్యర్థి నెల రోజులపాటు డ్రైవింగ్ శిక్షణ చేస్తారు. అందులో 25 రోజులు డ్రైవింగ్, 5 రోజులు డ్రైవింగ్పై తరగతుల నిర్వహణ ఉంటుది. ప్రతి ఒక్కరికీ అరగంట చొప్పున డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు. భోజన విరామ సమయం డ్రైవింగ్ బస్సులోనే ఉంటుంది. అభ్యర్థులే భోజనం సమకూర్చుకోవాలి. రోజువారీగా అరగంట చొప్పున డ్రైవింగ్ శిక్షణ చేసిన అభ్యర్థులు 25 రోజుల్లో 13 గంటల డ్రైవింగ్ చేయనున్నారు. శిక్షణకోసం ఆర్టీసీ అధికారులు ఎంపిక చేసిన రూట్లలో అభ్యర్థులు డ్రైవింగ్ చేయాలి. ప్రైవేట్కు దీటుగా ఆర్టీసీ యాజమాన్యం డ్రైవింగ్ శిక్షణతో కూడా ఆదాయం సమకూరనున్నది. దీంతో కార్మికుల జీతాలు, కార్యాలయ నిర్వహణకు యాజమాన్యంపై ఆధారపడాల్సిన అవసరం తగ్గనున్నది.
నిష్ణాతులతో డ్రైవింగ్ శిక్షణ..
ఆర్టీసీలో సుదీర్ఘంగా డ్రైవింగ్ చేసి, ప్రమాదాలు జరుగ కుండా ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చిన డ్రైవర్లను శిక్షణకు ఎంపిక చేశారు. ముఖ్యంగా ప్రమాద రహిత డ్రైవర్లతో పాటు కేఎంపీఎల్లో ప్రతిభ చూపిన వారిని ఇన్స్ట్రక్టర్లుగా నియమించేందుకు అధికారులు ఎంపిక చేయనున్నారు. సంగారెడ్డి డిపోలో 28 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన డ్రైవర్ శ్రీనివాస్తో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు నియమించారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో ఎంపికైన డ్రైవర్లకు హకీంపేట డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా శిక్షణ సమయంలో బస్సు పూర్తిగా డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్న డ్రైవర్ అజమాయిషీలో ఉంటుంది. ఎందుకంటే శిక్షణలో అభ్యర్థులు ఇష్టానుసారంగా నడిపే పరిస్థితి వారికి ఉండదు. డ్రైవింగ్ నేర్పించే వాహనాలకు రెండువైపులా స్టీరింగ్, క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్ వంటివి సిద్ధం చేసి పెట్టారు. డ్రైవింగ్ శిక్షణకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సును తయారు చేసి డ్రైవింగ్కు సిద్ధం చేశారు. డిపోలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు తరగతులు నిర్వహించనున్నారు. అందులో ట్రాఫిక్ సిగ్నల్స్పై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారు.
డ్రైవింగ్ శిక్షణకు విధి విధానాలు..