10వేల ఎకరాలకు సాగునీరు
ఫలించిన మంత్రి ఈశ్వర్ కృషి
హర్షం వ్యక్తం చేసిన నాయకులు
ధర్మపురి, ఏప్రిల్ 2: డీ53 కాలువ ద్వారా దాదాపు 10వేల ఎకరాల ఆయకట్టు కలిగిన బోల్ చెరువు నిండుకుండలా ఉండడంతో మండల నా యకులు, రైతులు శుక్రవారం సందర్శించి సంతో షం వ్యక్తం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో ధర్మపురి నియోజకవర్గంలో ఒక్క ఎకరా కూడా ఎండకుండా సాగునీటి సరఫరా చేయిస్తున్నారని మంత్రి ఈశ్వర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అయితే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల మంత్రి ఈశ్వర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సీఎం సానుకూలంగా స్పందించి, వారబందీ లేకుంగా చివరి ఆయకట్టు వరకు నిరంతరం సాగు నీరందించాలని అప్పుడే సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో గొల్లపల్లి మండలంలోని డీ-60, డీ-64 కాలువల ద్వారా, బుగ్గారం మండలంలోని డీ-53, డీ-54 కాలువల ద్వారా, అదేవిధంగా ధర్మారం, వెల్గటూర్ మండలాల్లోని డీ-83 కాలువ ద్వారా చెరువులు, కుంటలకు నీరు అందుతున్నది. పెద్దపల్లి, మంథని, ఓదెల, శ్రీరాంపూర్ ప్రాంతాలకు డీ-86 కాలువ ద్వారా నీటి పారుదల కొనసాగతుండగా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు, మంత్రి ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. డీ 53 కాలువ నీటి ద్వారా నిండిన బోల్ చెరువును సందర్శించిన వారిలో ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్రెడ్డి, రామయ్యపల్లి సర్పంచ్ మెడపట్ల దుబ్బయ్య, నాయకులు కొండపెల్లి సుధాకర్రావు, రవీందర్రెడ్డి తదితరులున్నారు.
ఇవి కూడా చూడండి..
సుయెజ్ కాలువ నష్టం.. 100 కోట్ల డాలర్ల పరిహారం కోరుతున్న ఈజిప్ట్
కొవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఫ్రాన్స్లో లాక్డౌన్